షర్మిలతో కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్- నిప్పులు చెరిగిన జగన్-చంద్రబాబు అరెస్టు అందుకే..!
ఏపీలో పీసీసీ ఛీఫ్ గా సోదరి వైఎస్ షర్మిల నియామకం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతిలో జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న జ గన్.. కాంగ్రెస్ రాజకీయాలు, చంద్రబాబు అరెస్ట్, కేంద్రంతో సంబంధాలు వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాల్ని ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ తో పంచుకున్నారు..
Recommended Video

చంద్రబాబు అరెస్టుపై రాజ్ దీప్ అడిగిన ప్రశ్నపై స్పందించిన జగన్.. ఎన్నికల సమయంలో ఏ సీఎం ఒక పేరున్న వ్యక్తిని అరెస్టు చేయాలని అనుకోడన్నారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు యాక్షన్ తీసుకున్నప్పటికీ కోర్టులు నిర్థారిస్తాయన్నారు.ఏపీలో రెండు జాతీయ పార్టీలకు అంత సీన్ లేదని జగన్ తేల్చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలను ఎందుకు డ్రాప్ చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రతి పార్టీ తన సొంత సర్వేలను నిర్వహిస్తుందని, సర్వేలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుందన్నారు.

ప్రజలు ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారని, అయితే స్థానిక ఎమ్మెల్యేల రిపోర్ట్ సరిగ్గాలేదని, అందుకే ఇలా ముందుగా జాగ్రత్తపడుతున్నామని జగన్ చెప్పుకొచ్చారు. కేంద్రానికి మద్దతుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాము కేంద్ర ప్రభుత్వంతో స్నేహబంధం కొనసాగిస్తాం అదే సమయంలో ఇష్యూ బేస్డ్ పై మద్దతు ఇస్తున్నామన్నారు. అలాగే మీ సోదరి వైయస్ షర్మిలాను పీసీసీ చేశారు.. దీన్నెలా చూస్తున్నారన్న ప్రశ్నకు.. కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ ఆడుతోందని తెలిపారు.

ఇది కాంగ్రెస్కు అలవాటైన పనేనని, రాష్ట్రాన్ని విడగొట్టిందని, విభజించి పాలించు అనేది రాష్ట్రంలో చేసిందన్నారు. తమ కుటుంబంలో కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేస్తోందన్నారు. తన చిన్నాన్నను గతంలో తనపై ఉసిగొల్పిందని, కాంగ్రెస్ పార్టీ సమాధి అయ్యిందని, వాళ్లు ఇంకా పాఠాలు నేర్వలేదన్నారు. వైయస్సార్ లేకుండా 2004 2009లో కాంగ్రెస్ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలపై కోపంగా లేదా అని అడిగిన ప్రశ్నకు.. తనకు బాధ ఉందని, అయితే దేవుడిపై భారం వేశానని జగన్ తెలిపారు. తాను దేవుడిని నమ్ముతానని, అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు.

పదిహేను పదహారు సంవత్సరాల క్రితం తాను జగన్ రెడ్డిని కలిసినప్పుడు, ఇప్పటికీ జగన్ రెడ్డికి మధ్య మార్పు ఏంటని రాజ్ దీప్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మీరే బెటర్ జడ్జ్ అన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, మీకు అదే తృప్తి ఇస్తుందా అని అడిగిన ప్రశ్నకు.. తన పాదయాత్రలో ఎంతో మందిని కలిశానని, వారి సమస్యలను తీర్చడంలో తనకు తృప్తినిస్తోందన్నారు.

మీ రికార్డు చూసే ఓటేయమని అడుగుతున్నారు.. ఏంటదని ప్రశ్నిస్తే.. తన పరిపాలన బాగుందని మీరు భావిస్తేనే తనకు ఓటెయ్యండని ప్రతి పబ్లిక్ మీటింగ్లో అడుగుతున్నట్లు జగన్ తెలిపారు. నీ కాన్ఫిడెన్స్కు హ్యాట్సాఫ్ సీఎం గారు...అంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరూ ఇప్పటి వరకు ఇవ్వలేదని రాజ్ దీప్ దీనికి సమాధానంగా వ్యాఖ్యానించారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications