పర్యటన రద్దు చేసుకున్న జగన్
YS Jagan: చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ హత్యకు గురైన అస్ఫియా అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
జగన్ రానున్నారనే విషయం తెలిసిన వెంటనే హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన పుంగనూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. అస్ఫియా అంజుమ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. దీని తరువాత పోలీసులు వేగంగా స్పందించారు. దోషులను అరెస్ట్ చేశారు.

ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. జగన్ పుంగనూరు పర్యటన వల్ల అక్కడ జరిగిన ఏడేళ్ల బాలిక అస్ఫియా దారుణ హత్య రాష్ట్రం మొత్తం తెలిస్తుందని, దాని వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో మంత్రులు పుంగనూరుకు వచ్చారని విమర్శించారు.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్య జరిగిన సమయంలోనే ఇంత శ్రద్ధ తీసుకుని ఉంటే పుంగనూరు ఉదంతం పునరావృతం అయ్యేది కాదని, ఇలాంటి ఘాతుకాలకు ఒడిగట్టడానికి భయపడేవాళ్లని పెద్దిరెడ్డి అన్నారు. ముచ్చుమర్రి బాలిక విషయంలో ప్రభుత్వం గానీ, హోం మంత్రి అనిత గానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని విమర్శించారు. ఇప్పటివరకు కూడా దోషులను పట్టుకోలేదని మండిపడ్డారు.
జగన్ వస్తాడని తెలియడం వల్లే మంత్రులు పుంగనూరుకు వచ్చి హడావిడి చేశారని పెద్దిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక దాడులు, హత్యలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా ప్రజల సంక్షేమం కోసం పరిపాలన సాగించాలంటూ ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications