తల్లికి వందనం అర్హులైన విద్యార్థులు 80 లక్షలకు పైమాటే..!!
YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. వార్షికోత్సవ వేడుకలను జరుపుకొంటోంది.
గత ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. తొలి వార్షికోత్సవాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.

టీడీపీ కూటమి ఏడాది పాలనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ అని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత చేపట్టి ఏడాది పూర్తయిందని, ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారని, సూపర్ సిక్స్ అంటూ ఊదర గొట్టారని షర్మిల గుర్తు చేశారు. అధికారం ఇస్తే అన్నీ చేస్తానని నమ్మించి, ఆ తర్వాత విస్మరించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా మోసం అని మండిపడ్డారు.
సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా ? అని ప్రశ్నించారు షర్మిల. ఏడాది గడిచినా సూపర్ సిక్స్ హామీలు గుర్తుకు రాలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు లేకుంటే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని షర్మిల పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. ఒకరికైనా నిరుద్యోగ భృతి కల్పించలేదని షర్మిల విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని, 55 లక్షల మంది రైతులను మోసం చేశారని అన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని, రాష్ట్రంలో 80 లక్షలకు పైగా అర్హులైన విద్యార్థులు ఉంటే ఇప్పుడు 60 లక్షల మంది విద్యార్థులకు ఇస్తాం అంటున్నారని చెప్పారు.
ప్రతి మహిళలకు మహిళా శక్తి కింద నెలకు 1,500 రూపాయలతో ఏడాదికి 18,000 మొత్తాన్ని ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, మహిళలను ఒక శక్తిగా చేస్తామని చెప్పి మోసం చేశారని షర్మిల ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి చంద్రబాబుకు మనసు రాలేదా అని నిలదీశారు.
కరెంట్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రెండు సార్లు పెంచారని, దీనివల్ల ప్రజలపై 17,000 కోట్ల రూపాయల భారం వేశారని విమర్శించారు. మొత్తంగా చంద్రబాబు గారి ఏడాది పాలన అంతా త్రీD గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేశారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications