స్పీకర్కు విజయమ్మ లేఖ, తిట్టుకున్నా మేమే: ఎర్రబెల్లి
తిట్టుకున్నా: ఎర్రబెల్లి
వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులం బయట ఎన్ని తిట్టుకున్నా శాసన సభలో మాత్రం ఐక్యంగానే ఉన్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. టిటిడిపి నుండి ఎర్రబెల్లి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ ఐకాస సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బయట తిట్టుకున్నా సభలో ఐక్యంగా ఉన్నామన్నారు.
సీమాంధ్ర టిడిపి కూడా రేపటి నుండి సభలో చర్చకు సహకరిస్తుందన్నారు. సభ సజావుగానే సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుపై చర్చ పేరుతో వెనుక నుండి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బిల్లుపై ఓటింగ్ పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ జరగాలన్నారు. బిల్లుపై సవరణలు కాకుండా సూచనలు చేద్దామన్నారు. రెవెన్యూ పంపకాలకు తాము అంగీకరించేది లేదని చెప్పారు.
కాగా, తెలంగాణ టిఎన్జీవో భవన్లో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో బస్వరాజు సారయ్య, డి శ్రీనివాస్, ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఈటెల రాజేందర్, హరీష్ రావు, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.