నాగబాబు పై వైసీపీ ఎంపీ అభ్యర్ది ఫిక్స్ - గెలుపెవరిది..!!
ఏపీలో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ప్రతీ సీటులోనూ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ,జనసేన ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాల పైన జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. పొత్తు లో భాగంగా రీజియన్ల వారీగా ముఖ్య నేతలు పోటీకి సీట్లు ఖాయం అవుతున్నాయి. అందులో భాగంగా భీమవరం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ ఖరారైంది. ఇదే సమయంలో వైసీపీ అభ్యర్ది దాదాపు ఫిక్స్ అయ్యారు.
ఎంపీగా నాగబాబు పోటీ: ఈ సారి ఎన్నికలు పార్టీల కంటే నేతల వ్యక్తిగత ప్రతిష్ఠగా మారుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ పోటీ చేసే నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డికి, మంగళగిరి లో సాయిరెడ్డి, భీమవరంలో ఎంపీ మిధున్ రెడ్డికి గెలుపు బాధ్యతలు అప్పగించారు. మెగా బ్రదర్ నాగబాబు ఈ సారి అనకాపల్లి నుంచి పోటీ చేయటం ఖాయమైంది.

గత ఎన్నికల్లో నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పొత్తుల్లో భాగంగా గెలుపు సాధ్యమనే అంచనాలతో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఇదే అనకాపల్లి ఎంపీగా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన అల్లు అరవింద్ 294183 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది వెంటక సత్యవతి 586,226 ఓట్లు సాధించి 89,192 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
వైసీపీ అభ్యర్ది పై కసరత్తు: 2019 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్ది చింతా పార్ధసారధికి 82,588 ఓట్లు దక్కాయి. ఈ సారి నాగబాబు పైన వైసీపీ నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను మరోసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించటం పైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో అవంతి టీడీపీ నుంచి ఇక్కడ ఎంపీగా గెలుపొందారు. అవే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గుడివాడ అమర్నాధ్ కు 520,531 ఓట్లు వచ్చాయి.
అవంతి మరోసారి భీమిలి నుంచి పోటీకి సిద్దమయ్యారు. అదే సమయంలో నాగబాబు పైన బీసీ అభ్యర్దిని బరిలోకి దించే ఆలోచన పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాల నాయుడు పేరును పరిశీలిస్తున్నారు. అనకాపల్లి పరిధిలోని మాడుగుల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొప్పుల వెలమ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆయన పేరును పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అనకాపల్లిలో కొత్త లెక్కలు: సామాజిక సమీకరణాల్లో భాగంగా కాపు లేదా బీసీ వర్గాల్లో ఎవరికి ఎంపీ సీటు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ వర్గానికి కేటాయించటం ద్వారా నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జనసేన పెందుర్తి, ఎలమంచిలి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.
దీంతో, నాగబాబుకు ఈ లెక్క కూడా అనుకూలిస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ పార్లమెంట్ పరిధిలో సీఎం జగన్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్దులను ఖరారు చేసారు. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్ది విషయంలో జగన్ అధికారికంగా చేసే ప్రకటన పైన ఆసక్తి కనిపిస్తోంది.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications