ఫ్లెమింగో పక్షులే కాదు.. పులస చేపలకూ..! పవన్ కు భూమన సూచన..!
ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అధికారులకు ఓ సూచన చేశారు. పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలనేది ఆ సూచన. పర్యావరణ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన ఆ సూచనపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగంగా స్పందించారు. పవన్ చేసిన సూచనను ఓవైపు స్వాగతిస్తూనే అలాగే పులస చేపలకూ ఇలాగే శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలంటూ భూమన సెటైర్లు వేశారు.
పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన శాఖకు చెందిన అధికారుల్ని కోరారు. ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్... ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామన్నారు.
పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైందని, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న సైబీరియన్ పక్షులు... ఫ్లెమింగోలు మనందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయని తెలిపారు. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఆరు నెలలపాటు మన పులికాట్ పరిసరాల్లో ఉంటాయని, ప్రతి ఏటా ఈ నీటి పక్షుల రాకను 'ఫ్లెమింగో ఫెస్టివల్' పేరిట ఘనంగా వేడుక చేసుకుంటామన్నారు. మూడు రోజుల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవడం ఫ్లెమింగోలతో మనకున్న అనుబంధానికి నిదర్శనమన్నారు.

ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్... ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతాం
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 3, 2025
పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న సైబీరియన్ పక్షులు... ఫ్లెమింగోలు మనందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఆరు… pic.twitter.com/PotDdsAVrP
మొంథా తుపానుకు ముందు నుంచే ఫ్లెమింగోల రాక మొదలైందని, పెను గాలులు, భారీ వర్షాలకు వాటి స్థావరాలకు ఇబ్బంది కలగకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టామన్నారు. రానున్న మూడు నెలలు ఫ్లెమింగోల రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అటవీ అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. పులికాట్ ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తిరుపతి
— YSR Congress Party (@YSRCParty) November 5, 2025
భూమన కరుణాకరరెడ్డి గారు, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామెంట్స్..
పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటి సీఎం @Pawankalyan మాటలు అభినందనీయం, మీ పేరులోనే పవనం, కళ్యాణం రెండు ఉన్నాయి, సైబీరియ నుంచి వందల… pic.twitter.com/G3EfIylAHK
ఈ సూచనపై స్పందిస్తూ భూమన.. పవన్ మాటలు అభినందనీయమన్నారు. మీ పేరులోనే పవనం, కళ్యాణం రెండు ఉన్నాయని తెలిపారు. సైబీరియా నుంచి వందల ఏళ్ల నుంచి వలస వస్తున్నాయని, వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించే పులస చేపల్ని కూడా గోదావరిలో ఉండేట్లుగా శాశ్వత నివాసం కల్పించాలని కోరుతున్నామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో శీతల వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో చల్లదనం శాశ్వతంగా ఉంచాలని కోరుతున్నట్లు తెలిపారు. సనాతన ధర్మపరిరక్షకా మీరు ఇంకా ఎన్నో చేయాలి, ప్రమాదాలు జరగకుండా రోడ్లు, దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా, మద్యం మత్తులో అనర్థాలు జరగకుండా చూడాలి, మీరు గాల్లో పక్షుల్ని, నీటిలో చేపల్ని మీరు ఆధీనంలో ఉంచుకోవాలనుకోవడం అభినందిస్తున్నా..ప్రకృతి ఆశించే శక్తి మీకు కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా..ఇప్పటికే మీ జ్ఞాన తృష్ణ, ప్రజలకు అర్థం అయ్యిందన్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications