ఉప ఎన్నికల్లో పోటీ చేయం: జగన్ పార్టీ, బీటెక్ రవితో బాబు సుదీర్ఘ భేటీ
కార్పోరేషన్ పరిధిలో జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. విజయవాడ నగర కార్పోరేషన్ పరిధిలోని 11వ డివిజన్కు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేద
విజయవాడ: కార్పోరేషన్ పరిధిలో జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. విజయవాడ నగర కార్పోరేషన్ పరిధిలోని 11వ డివిజన్కు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని వైసిపి నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
చనిపోయిన వ్యక్తుల కుటుంబాలపై పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని, అందుకే పోటీ చేయడం లేదని చెప్పారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన టిడిపి కార్పోరేటర్ వీరంకి డాంగే కుమార్ అనారోగ్యంతో 2015లో మృతి చెందారు. దీంతో ఆ డీవిజన్లో ఖాళీ ఏర్పడింది. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.

ఇదిలా ఉండగా, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టిడిపి సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. కడప జిల్లా నుంచి గెలిచిన బీటెక్ రవి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన మాధవ్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు.
భేటీలో పలు విషయాలపై చర్చించారు. బీటెక్ రవితో చంద్రబాబు సుమారు అరగంట పాటు మాట్లాడారు. అయనను అభినందించారు. టిడిపి - బిజెపి జోడీకి ప్రజల నుంచి మద్దతు ఉందనేందుకు తన విజయమే తార్కానమని సీఎం చంద్రబాబుతో మాదవ్ అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications