Hijab: హిజాబ్ దెబ్బతో ఎంతమంది ముస్లీం అమ్మాయిలు యూనివర్శిటీలో టీసీలు తీసుకుని వెళ్లిపోయారంటే?!
బెంగళూరు/మంగళూరు/ఉడిపి: హిజాబ్ ధరించి స్కూల్స్, కాలేజ్ లతో పాటు విద్యాసంస్థల్లోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ కావడంతో ముస్లీం అమ్మాయిలు టీసీలు తీసుకుని వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది, ఒక్క విశ్వవిద్యాలయం (యూనివర్శిటి) పరిధిలోనే ఎక్కువ మంది అమ్మాయిలు టీసీలు తీసుకున్నారని వెలుగు చూసింది.
యూనివర్శిటీ పరిదిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజ్ లో రెండు, మూడు, నాలుగు, ఐదవ సెమిస్టర్ చదువుతున్న ఎక్కువ మంది ముస్లీం అమ్మాయిలు టీసీలు తీసుకుని వెళ్లిపోయారని వెలుగు చూసింది. 2020-21, 2021-22 విద్యాసంవత్సరంలో చేరిన ముస్లీం అమ్మాయి చాలా మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారని స్వయంగా యూనివర్శిటీ అధికారులు సమాచారం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలో హిజాబ్ వివాదం
కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో హిజాబ్ లు వేసుకుని కాలేజ్ లోకి ప్రవేశించిన అమ్మాయిలను ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అడ్డుకోవడంతో వివాదం మొదలైయ్యింది. అప్పట్లో మొదలైన హిజాబ్ వివాదం పెద్దది అయ్యింది. విద్యాసంస్థలు మూసివేశారు. కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
హిజాబ్ లు నిషేధం
హిజాబ్ లు, మతపరమైన దుస్తులు వేసుకుని స్కూల్స్, కాలేజ్ లతో పాటు విద్యాసంస్థల్లోకి ప్రవేశించకూడదని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన అమ్మాయిల్లో కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ లుకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని కొందరు ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. హిజాబ్ వివాదంలో దాఖలు అయిన అర్జీ ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.
మా టీసీలు మాకు ఇచ్చేయండి
హిజాబ్ ధరించి స్కూల్స్, కాలేజ్ లతో పాటు విద్యాసంస్థల్లోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ కావడంతో ముస్లీం అమ్మాయిలు టీసీలు తీసుకుని వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది, కర్ణాటకలోని మంగళూరు యూనివర్శిటీ పరిధిలోనే ఎక్కువ మంది అమ్మాయిలు టీసీలు తీసుకున్నారని సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంతో ఈ విషయం వెలుగు చూసింది.
16 శాతం మంది టీసీలు తీసుకున్న ముస్లీం అమ్మాయిలు
యూనివర్శిటీ పరిదిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజ్ లో రెండు, మూడు, నాలుగు, ఐదవ సెమిస్టర్ చదువుతున్న ఎక్కువ మంది ముస్లీం అమ్మాయిలు టీసీలు తీసుకుని వెళ్లిపోయారని వెలుగు చూసింది. 2020-21, 2021-22 విద్యాసంవత్సరంలో చేరిన ముస్లీం అమ్మాయి చాలా మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారని స్వయంగా యూనివర్శిటీ అధికారులు సమాచారం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజ్ ల్లో చదువుతున్న 900 మంది ముస్లీం విద్యార్థుల్లో 145 మంది ముస్లీం అమ్మాయిలు టీసీలు తీసుకుని వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.