ఆర్ఐఎల్ తర్వాత! 8లక్షల కోట్ల విలువైన భారతీయ కంపెనీగా టీసీఎస్
న్యూఢిల్లీ: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు నమోదు చేసింది. మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) తర్వాత రూ.8లక్షల కోట్లు మార్క్ దాటిన రెండో సంస్థగా అవతరించింది.
మంగళవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేర్లు 2శాతానికి పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 8,01,550 కోట్లను తాకిందని టీసీఎస్ తెలిపింది.

కాగా, ఈ మార్క్ను దాటిని తొలి కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు సాధించగా.. ఇప్పుడు టీసీఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఆగస్టు 23న రిలయన్స్ ఇండస్త్రీస్ మార్కెట్ విలువ రూ.8లక్షల కోట్లు దాటింది.
అయితే, 100 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిన తొలి భారతీయ కంపెనీ టీసీఎస్ కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్లోనే టీసీఎస్ ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత జూన్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.7లక్షల కోట్లు దాటింది. తాజాగా, 8లక్షల కోట్లు దాటింది. కాగా, ఇన్ఫోసిస్ 3.05శాతం, మైడ్ ట్రీ 2.45శాతం, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి కంపెనీలు 1.85శాతం లాభపడ్డాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications