లక్షా 87 వేలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1378 మందికి పాజిటివ్..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 1500 నుంచి 2 వేల వరకు వచ్చిన పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 13 వందల పైచిలుకు పాజిటివ్ కేసులు వచ్చాయి. 1378 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 87 వేల 211కి చేరింది.
ఆదివారం కరోనా వైరస్ నుంచి 1932 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ తగ్గిన వారి సంఖ్య లక్ష 56 వేల 431కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29 వేల 673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 24 వేల 54 మంది హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో కరోనా వైరస్తో ఏడుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది.

గ్రేటర్ పరిధిలో 254 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. కరీంనగర్లో 152, రంగారెడ్డిలో 147 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రికవరీ రేటు కూడా పెరగడం సానుకూలంగా మారింది. ఇటు వ్యాక్సిన్ ప్రయోగాలు రెండు, మూడు దశల్లో ఉండటంతో మరికొద్ది నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు వైరస్ సోకిన వారందరూ దాదాపుగా కోలుకునే పరిస్థితి ఉంది. కానీ ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పా.. మిగతావారు వేగంగా క్యూర్ అవకాశాలే మెరుగ్గా ఉన్నాయి. దేశంలో వ్యాక్సిన్ ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలంటే రూ.80 వేల కోట్ల వ్యయం అవుతోంది.
Recommended Video
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications