ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు.. తిరిగిరాలేదు, ఇంతకీ ఆ బావిలో ఏం జరిగింది..!!
కౌటాల : బావిలో మోటారు అమరుస్తామని వెళ్లిన వారు తిరిగిరాలేదు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు. ఏం జరుగుతుందో తెలియలేదు. మరొకరిని పంపి .. నిశీతంగా గమనించేసరికి కొద్ది లోతుకు వెళ్లక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని పైకి లాగి ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు శ్వాస ఆడక చనిపోవడంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ముత్యంపేటలో విషాదం చోటుచేసుకుంది. చేతికొచ్చిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

వెళ్లారే తప్ప ..
ముత్యంపేటలో కారెం రాజు తన కుటుంబంతో ఉంటున్నారు. ఆయనకు మహేశ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వారి ఇంటి వద్ద 30 అడుగుల లోతు, మూడు అడుగుల వెడల్పు గల బావి ఉంది. అయితే దానికి మోటారు అమర్చాలని నిర్ణయించారు. ఇవాళ తొలుత తన కుమారుడు మహేశ్ బావిలోకి దిగాడు. అయితే తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు రాకేశ్ను దింపారు. లోపల కరెంట్ షాక్ తగిలిందోమోనని భావించి .. విద్యుత్ ఆఫ్ చేశారు. తర్వాత శ్రీనివాస్ను కూడా దింపారు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురిని దింపినా చడీ చప్పుడు లేదు. ఒక్కొక్కరు ఊబిలోకి వెళ్తున్నారే తప్ప స్పందించడం లేదు. దీంతో వారికి అనుమానం వచ్చింది.

నిశీతంగా పరిశీలిస్తే తప్ప ..
మూడో వ్యక్తి శ్రీనివాస్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బయట ఉన్నవారి ఆందోళన ఎక్కువైంది. ఇలా కాదని మరో యువకుడిని మెల్లగా దించారు. కొద్ది లోతు వెళ్లాక ఆ యువకుడు అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. దీంతో వారికి బావిలో శ్వాస ఆడటం లేదని నిర్దారణ అయ్యింది. వెంటనే అతడిని పైకి లాగారు. చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. కానీ ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో స్థానికులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

జేసీబీలతో
మరోవైపు తమ బావిలో మోటారు అమర్చేందుకు వెళ్లి ముగ్గురు తిరిగిరాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు .. జేసీబీల సాయంతో బావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. బావిలో ఊపిరాడక చనిపోయిన ముగ్గురి మృతదేహలను వెలికితీస్తారు. అయితే గ్రామంలో ముగ్గురు యవకుల ఆకాల మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ కుటుంబసభ్యలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఓకేసారి ముగ్గురు చనిపోవడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications