80 సీట్లు గెలుస్తాం.. మేయర్ పీఠం మాదే..?, గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ధీమా
గ్రేటర్ ఎన్నికల సమయం ఆస్నమవుతోంది. నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో ఇటీవల మంత్రి కేటీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటు బీజేపీ కూడా ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. అయితే మేయర్ పీఠంపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తామంటే తాము మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో టీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమాతో ఉన్నారు. తమ పార్టీ 80 సీట్లలో గెలుస్తోందని చెప్పారు. సర్వేలు ఇదే అంశాన్ని చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇదివరకు విజయం సాధించిన కార్పొరేటర్ల మీద ప్రజలకు మంచి అభిప్రాయం లేదని చెప్పారు. అందుకోసమే ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చేస్తున్నాయని తెలిపారు.

గత ఐదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్కు చేసిందేమీ లేదని రామచంద్రరావు విమర్శించారు. అభివృద్ధి పేరుతో రూ.60 వేల కోట్లు మెక్కారని ఆయన ఆరోపించారు. చిన్న వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ అస్తవ్యస్తం అవుతుందని తెలిపారు. గత పాలకులు ఏం చేయలేరు అని కామెంట్స్ చేసి కాలం వెళ్లారని మండిపడ్డారు. డెవలప్ మెంట్పై మంత్రులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సమస్యలు ఉంటే.. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కానీ మిన్నకుండిపోవడం సరికాదన్నారు. కరోనా వైరస్, ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు మాత్రం ఆగడం లేదు అని కేటీఆర్ తెలిపారు. ఇవే అంశాలను ప్రజలకు వివరించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతలు విధించామని చెప్పారు. సంక్షోభాన్ని అలా నెట్టుకొస్తున్నామని తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications