ఇంటర్ బోర్డు తప్పులు కనిపిస్తున్నా , మంత్రి నమ్మారా ? బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్న జగదీశ్ రెడ్డి
ఓవైపు ఇంటర్ విద్యార్థులు తమ భవితవ్యంపై ఆందోళన చేస్తుంటే సంబంధిత విధ్యాశాఖ మంత్రి మాత్రం నిర్లక్షంగా సమాధానం చెబుతున్నారు. పరీక్షలు అన్న తర్వాత ఫెయిల్ కాకుండా ఉంటారా అంటూ స్పందిస్తున్నారు. తమ ప్రభుత్వం లోనే తప్పులు జరిగినట్టు చూపిస్తున్నారంటూ నిర్షక్ష్యపు సమాధానం చెబుతున్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, అందుకే ఆందోళనలనున రాజకీయ ఆరోపణలుగా కొట్టి పారేస్తున్నారు. బోర్డు తప్పిదాలు కళ్లముందు కనిపిస్తున్నా, మార్చి పోతే సెప్టెంబర్ లేదా అన్నట్టు వ్వవహరిస్తున్నారు సదరు మంత్రి

సాంకేతిక లోపాలు విద్యార్థులకు శాపాలు
ఇంటర్ విద్యార్థుల బాధలు వర్ణించలేకుండా ఉన్నాయి, సంవత్సరాలపాటు చదివి, మంచి మార్కులు తెచ్చుకోవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల ఆందోళన బాట పట్టారు. బోర్డు వ్శఫలితాలు తారుమారు అయ్యాయి. బోర్డు లోని సాంకేతిక లోపంలో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోయారు.దీంతో పాస్ కావల్సిన వారు ఫెయిల్ అయ్యారు. అసలు పరీక్షలే రాయని వారు పాసయిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు 90 శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మార్కుల మోమోల్లో 0 నుండి 9 మార్కులు వేసి చేతులు దులుపుకున్నారు అధికారులు.

మూడు రోజులుగా ఆందోళన చెందుతున్న విద్యార్థులు
తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా విద్యార్థులు, విద్యార్థుల సంఘాలు ఇంటర్ బోర్డువద్ద అందోళన చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించే బదులు ఇష్టనుసారం వ్వవహిస్తున్నారు. అసలు తప్పులే జరగలేదంటూ బుకాయిస్తున్నారు. దీంతో పాటు బోర్డు వద్దుకు వెళ్లిన విద్యార్థును కనీసం పలకరించే పరిస్థితి కూడ లేదు. పైగా మద్దతుగా వెళ్లిన ప్రజా సంఘాల నాయకులను, పార్టీ నాయకులతో విద్యార్థి సంఘాల నాయకులు నిర్భంధంగా అరెస్ట్ చేస్తున్నారు. అయినా అన్యాయం జరిగిన విద్యార్థులు తమ గళం విప్పుతూనే ఉన్నారు.

గ్లోబరీనా సంస్థపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు మంత్రి
అయితే ఇంత జరుగుతున్న తెలంగాణ విధ్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం ఇవ్వన్ని ఉహగానాలే అని కొట్టిపారేస్తున్నారు. ఈనేపథ్యంలోనే జరిగిన దానిపై ఎంక్యయిరి వేశామని చెబుతూనే , గ్లోబరీనా సంస్థపై పరీక్షలకు ముందునుండే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇది రాజకీయంగా కావాలనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.కాగా విద్యార్థులు బాగా పరీక్షలు రాశామని భావించే విద్యార్థులు రీవ్యాల్యుయెషన్ అప్లై చేసుకోవాలని ఉచిత సలహ ఇచ్చారు. ఇవేమీ కాకుండా కొంతమంది చెబితే,విద్యార్థులు రాజకీయం చేయడం కరెక్టు కాదని అంటూన్నారు. అయితే చట్టప్రకారం తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఫెలయిన విద్యార్థులకు మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా !
విద్యార్థులు ఫెలయితే ఆత్మహత్యులకు పాల్పడుతున్న విద్యార్థులపై సమాజంతోపాటు అన్ని రంగాలు ఆలోచించాలని అన్నారు. ఈనేపథ్యంలోనే పదవ తరగతి నుండి పీజీ వరకు కూడ విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని , దీంతో హత్మహత్యలు పాల్పడడం కరెక్టు కాదని సూచించిన ఆయన పరీక్షలను తిరిగి సంప్లిమెంటరీ లో రాసుకునే అవకాశం ఉందని ఓ మిడియా కు ఇచ్చిన ఇంటర్యూలో మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కోన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications