టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు: నాంపల్లి కోర్టులో రేణుకకు చుక్కెదురు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ కేసులో ఏ-3 నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిట్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. తనకు అనారోగ్యంగా ఉందని, చిన్నారుల బాగోగులు చూసుకునేవారు లేరని రేణుక పిటిషన్లో పేర్కొంది.
పేపర్ లీకేజీతో తనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని, కేవలం నేరాభియోగాలు మాత్రమే చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, కేసు విచారణ దశలో ఉన్నందున రేణుకకు బెయిల్ ఇవ్వొద్దని సిట్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ క్రమంలో రేణుక బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇటీవల అరెస్టయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీ కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. కాగా, పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications