Hyderabad News: వారే హత్య చేయించారు.. నారాయణ రెడ్డి మర్డర్ కేసులో వీడిన మిస్టరీ..
సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లో శవమై కనిపించిన నారాయణరెడ్డిని అతని అత్తమామలే హత్య చేయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. జూలై 3న సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లో నారాయణ రెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం పంచాయతీ పి.పొట్రెడ్డిపల్లెకి చెందిన శనివారపు బాలిరెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు నారాయణరెడ్డి (25) బీటెక్, హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన దూరపు బంధువైన కందుల వెంకటేశ్వరరెడ్డి కుమార్తె రవళిని ప్రేమించి ఏడాది క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహం అమ్మాయి తరుఫువారి నచ్చకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. కొద్ది రోజుల తర్వాత రవళి తల్లిదండ్రుల వచ్చి ఓ వారంలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని, కుమార్తెను ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు కోరడంతో రవళిని వారితో పంపించాడు నారాయణ రెడ్డి. ఆ తర్వాత రవళీని తిరిగి పంపించలేదు. దీంతో అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. నారాయణ రెడ్డిని అడ్డు తొలగించి తమ కూతురు మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వరరెడ్డి బంధువు శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రణాళిక రచించాడు.

జూన్ 27న రాత్రి 8.40 గంటల సమయంలో మిత్రులు కాశీ, ఆశిక్తో కలిసి కేపీహెచ్బీలో ఉంటున్న నారాయణరెడ్డి వద్దకు వెళ్లిన శ్రీనివాసరెడ్డి, విందు చేసుకుందామని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకుని ఖాజాగూడ వైపు తీసుకెళ్లారు. ఖాజాగూడలో మద్యం కొని, జిన్నారం వైపు వెళ్లారు. నారాయణరెడ్డిని మార్గమధ్యంలో గొంతు నులిమి హత్య చేశారు. జిన్నారం శివార్లలోని అడవిలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు.అక్కడి నుంచి వారంతా పరారయ్యారు.
నారాయణరెడ్డి 3 రోజులుగా తిరిగిరాలేదని అతనితోపాటు గదిలో ఉంటున్న బావ చంద్రశేఖర్రెడ్డి గత నెల 30న కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నారాయణరెడ్డితోపాటు అనుమానితుల ఫోన్కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు శనివారం రాత్రి ఆశిక్ను పట్టుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications