హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. ఏంది ఇదీ పాల్.. తెలంగాణను డెవలప్ చేశారట.. ఎలా అంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా జరుగుతున్నాయి. మధ్యలో కేఏ పాల్ వచ్చారు. అదేనండి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.. అయితే ఆయన తెలంగాణను అభివృద్ధి చేసింది తనేనని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ పుట్టక ముందు 40 సంవత్సరాలలో తెలంగాణను అభివృద్ధి చేసింది తనే అని కేఏ పాల్ అన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా దగ్గరికి వచ్చారని చెప్పారు.

వందలు, వేల మంది బిలియనీర్లను తీసుకొచ్చి తెలంగాణను డెవలప్ చేశానని కేఏ పాల్ వివరించారు. కేసీఆర్, కేటీఆర్.. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ పేర్లు అయినా విన్నారా? అని కేఏ పాల్ అడిగారు. తెలంగాణను అభివృద్ది చేసింది తానే అన్నారు. సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో ఉచిత చారిటీ సిటీ పెట్టి హైదరాబాద్ అమీర్ పేట్ లో 53వేల మంది అనాథలు, వితంతవులకు సపోర్ట్ చేశాను అన్నారు.

telangana development is done by ka paul

తెలంగాణను అభివృద్ధి చేసింది తానే అని అందరికీ తెలుసు అన్నారు. ఇప్పుడు 20, 30 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఆ విషయం తెలియకపోవచ్చన్నారు. గూగుల్ చేస్తే తెలుస్తుందన్నారు. జార్జిబుష్, బిల్ క్లింటన్ హైదరాబాద్ కు తీసుకొచ్చింది తనేనని చెప్పారు. అప్పుడు కేసీఆర్ పొలిటికల్ గా పుట్టారా? అని పాల్ అడిగారు. ఏదో టీడీపీలో పార్టీలో ఒక సేవకుడిగా ఉన్నారు అని చెప్పారు.

అభివృద్ధి చేసిన తెలంగాణను... నేడు అవినీతిమయంగా మార్చేశారని మండిపడ్డారు. అప్పుల రాష్ట్రంగా మార్చారని పాల్ వాపోయారు. తెలంగాణ అప్పులు 4 లక్షల 12 కోట్లు అని చెప్పారు. 20 లక్షల కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల తెలంగాణగా ఎలా మారిందని కేఏ పాల్ ప్రశ్నించారు. సో అతని ప్రశ్నలకు అధికార పార్టీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

English summary
telangana development is done by ka paul
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X