Odisha: ఒడిశాలో పిడుగుల వర్షం.. 2 గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..
శనివారం ఒడిశా అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో పిడుగులు కూడా భారీగా పడ్డాయి. దీంతో 12 మంది మరణించారు. 14 మంది గాయపడినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (SRC) కార్యాలయం ఆదివారం తెలిపింది. ఎక్స్లో భాగస్వామ్యం చేసిన పోస్ట్లో, భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులతో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది పశువుల మరణాలు కూడా నమోదయ్యాయని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (SRC) కార్యాలయం ధృవీకరించింది. రెండు గంటల వ్యవధిలో 61 వేల పిడుగులు పడ్డాయని తెలిపారు.
"సెప్టెంబర్ 2 న ఒడిశా అంతటా విపరీతమైన ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించాయి. 12 మంది మరణించారు, 14 మంది గాయపడ్డారు. 8 పశువులు మరణించాయి" అని ఎక్స్లోని పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ తెలిపింది. పశువుల మరణాల విషయంలో ఆమోదయోగ్యమైన విధంగా సహాయం ఇస్తామని పేర్కొంది. ఖుర్ధా జిల్లాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పేర్కొన్నారు.

ఇక్కడ నలుగురు వ్యక్తులు మరణించారని తెలియజేశారు. బోలంగీర్లో ఇద్దరు, శనివారం అంగుల్, బౌధ్, ధెంకనల్, గజపతి, జగత్సింగ్పూర్, పూరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతాలలో భారీ వర్షాలు. పిడుగులు పడ్డాయి. భువనేశ్వర్ దాని పరిసరాల్లో మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడింది. భారత వాతావరణ శాఖ (IMD) శనివారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. నబరంగ్పూర్, కలహండి, నువాపా, రాయగడ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. గంజాం, గజపతి, కంధమాల్, నయాగఢ్, బలంగీర్, సోనేపూర్, బౌధ్, బర్గర్, సంబల్పూర్, డియోగర్, అంగుల్, ధెంకనల్, జాజ్పూర్, కియోంజర్, ఖుర్దా (కటక్ నగరంతో సహా), కటక్ (కటక్ నగరంతో సహా). అలాగే, మల్కన్గిరి, కోరాపుట్, జార్సుగూడ, సుందర్గఢ్, పూరి, జగత్సింగ్పూర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది.
ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం సక్రియంగా ఉందని, మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. సెప్టెంబర్ 7, 2023 వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications