ఘోర ప్రమాదం: లోయలో పడ్డ వ్యాన్, 13మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర్కాశీ జిల్లాలో ఓ వ్యాను లోయలో పడి 13 మంది మృతిచెందారు. బట్వాడీలో సోమవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి లోయలో పడిపోయింది.
పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. బట్వాడీలోని బకోలీ గ్రామానికి చెందిన 13 ఏళ్ల మీనాక్షి, రాధలు ప్రాణాలతో బయటపడ్డారు.

దోపిడీ దొంగల బీభత్సం
చెన్నై- పాట్నా ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బోగీల్లోకి చొరబడిన దుండగులు ప్రయాణికులపై దాడి చేసి వారి నుంచి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెన్నై నుంచి ఆదివారం గంగా-కావేరీ ఎక్స్ప్రెస్ బీహార్ రాజధాని పాట్నాకు బయల్దేరింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఉత్తర్ప్రదేశ్లోని చిత్రాకూట్ మీదుగా వెళ్తున్న ఎక్స్ప్రెస్లోకి కొందరు దోపిడీ దొంగలు చొరబడ్డారు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో ప్రయాణికులను బెదిరించారు. వారి నుంచి నగలు, డబ్బు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications