వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర పడవ ప్రమాదం, 8 మంది మృతి: 17 మందిని కాపాడిన రెస్క్యూ టీం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో 25 ప్రయాణీకులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. ఒకరు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎనిమిది మృతదేహాలను బయటకు తీశారు.

రెస్క్యూ సిబ్బంది పదిహేడు మందిని కాపాడింది. వీరంతా ఓ జాతరకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే ఉన్నతాధికారులు, నేవీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతనిని ఆచూకీ గుర్తించేందుకు గోవా నుంచి డైవర్లు, హెలికాప్టర్లను దించారు.

8 Dead After Boat Capsizes Off Karwar In Karnataka

ఈ పడవ ప్రమాదానికి గురైన సమయంలో కార్వార్ బీజేపీ నాయకురాలు, ఎమ్మెల్యే రూపాలీ నాయక్ మరో పడవలో ఉన్నారు. పడవ ప్రమాదంలో మునిగిన వారిని రక్షించాలని ఈమె వెంటనే తన సిబ్బందిని ఆదేశించారు. ఆమె సిబ్బంది ఇద్దరిని కాపాడారు. ఆ తర్వాత నేవీ రంగంలోకి దిగింది.

English summary
Eight people have died in Karnataka after a boat on which they were travelling capsized off the Karwar coast. There were 26 people on the boat when the accident took place. Local fishermen and the Coast Guard have found eight bodies till now. One person is reported missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X