Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘోర పడవ ప్రమాదం, 8 మంది మృతి: 17 మందిని కాపాడిన రెస్క్యూ టీం

బెంగళూరు: కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో 25 ప్రయాణీకులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. ఒకరు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎనిమిది మృతదేహాలను బయటకు తీశారు.

రెస్క్యూ సిబ్బంది పదిహేడు మందిని కాపాడింది. వీరంతా ఓ జాతరకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే ఉన్నతాధికారులు, నేవీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతనిని ఆచూకీ గుర్తించేందుకు గోవా నుంచి డైవర్లు, హెలికాప్టర్లను దించారు.

8 Dead After Boat Capsizes Off Karwar In Karnataka

ఈ పడవ ప్రమాదానికి గురైన సమయంలో కార్వార్ బీజేపీ నాయకురాలు, ఎమ్మెల్యే రూపాలీ నాయక్ మరో పడవలో ఉన్నారు. పడవ ప్రమాదంలో మునిగిన వారిని రక్షించాలని ఈమె వెంటనే తన సిబ్బందిని ఆదేశించారు. ఆమె సిబ్బంది ఇద్దరిని కాపాడారు. ఆ తర్వాత నేవీ రంగంలోకి దిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+