మైనింగ్ అడ్డాలో మైండ్ బ్లాక్, ఆంధ్రా బార్డర్ లో ఏం జరిగిందంటే ? ఎన్నికల ఎఫెక్ట్ స్వామి, అంతే !
గనుల గడ్డగా పేరొందిన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. లోక్సభ ఎన్నికల ముందురోజు పత్రాలు లేకుండా కోట్ల విలువైన డబ్బు, వందల కిలోల బంగారం పట్టుబడింది. ఒకేసారి రూ 5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలను బళ్లారి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దెబ్బతో బళ్లారి నాయకులు బిత్తరపోయారు.
కర్ణాలకోని బళ్లారి జిల్లా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా అయిన అనంతపురం జిల్లాలోని పలు గ్రామాలు ఉన్నాయి. నిత్యం బళ్లారి జిల్లా, ఆనంతపురం జిల్లా ప్రజల ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు సంచరిస్తుంటారు. వ్యాపార లావాదేవీలు, బంధువుల ఇళ్లకు వెళ్లిరావడంతో పాటు రాజకీయ కార్యకలాపాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మామూలుగానే ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని చెక్ పోస్టుల్లో సోదాలు జరుగుతూనే ఉంటాయి.

లోక్ సభ ఎన్నికలకు తేదీ ప్రకటించిన తరువాత బళ్లారి జిల్లాలో ఇంకా ఎక్కువగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల ప్రధాన రహదారులతో పాటు పలు గ్రామాలకు వెళ్లి వచ్చే ప్రాంతంలో కొత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇలాంటి చెక్ పోస్టుల్లో పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పలు వాహనాల్లో సోదాలు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో బళ్లారి జిల్లా అధికారులు కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం రూ 7. 60 కోట్ల విలువైన డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో జ్యువెలరీ యజమాని నరేష్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నరేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు, ఎన్నికల అధికారులు తెలిపారు.

చిక్కమగళూరులో రూ.45 లక్షల నగదు పట్టుబడిన ఘటనలో హవాలా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు కర్ణాటక పోలీసు చట్టంలోని సెక్షన్ 98 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం దర్యాప్తును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. కర్ణాటక సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు గోవా ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!











Click it and Unblock the Notifications