వీడియో: పై ప్రాణాలు పైనే పోయుంటాయ్..!!
Bannerghatta Zoo Park: బెంగళూరులో జూపార్క్ సందర్శకులకు వింత అనుభవం ఎదురైంది. ఓ చిరుత సందర్శకుల వాహనంపై దాడి చేసింది. ఆ వాహనంపైకి ఎక్కింది. ఆ వెహికల్ కిటికీని పట్టుకుని కొద్దిసేపు వేలాడుతూ ఉండిపోయింది. ఒక దశలో అతి కిటికీ నుంచి లోనికి తలదూర్చడానికి ప్రయత్నించింది.
బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట నేషనల్ పార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సందర్శకులతో నిండిపోయిన ఓ మినీ సఫారీ బస్ అది. సింహాలు, చిరుతలు, ఇతర వన్యప్రాణులను సందర్శకులు మరింత దగ్గరగా చూడటానికి సఫారీ వ్యవస్థ ఇక్కడ అందుబాటులో ఉంది.

దసరా పండగ సెలవులు కావడం వల్ల బన్నేరుఘట్ట జూపార్క్నకు సందర్శకులు పోటెత్తారు. రోజూ 15,000 మందికి పైగా పర్యాటకులు ఈ జూపార్క్ను సందర్శిస్తుంటారు. సెలవుల వల్ల ఈ సంఖ్య మరింత భారీగా ఉంటోంది. 730 హెక్టార్లల్లో విస్తరించిన అనేకల్ అటవీ ప్రాంతంలో వారికోసం రోజూ సఫారీని నిర్వహిస్తుంటారు.
ఇటీవలే సఫారీకి వెళ్లిన ఓ వాహనంపై చిరుత ఇలా దాడి చేసింది. తొలుత రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ చిరుత క్రమంగా సందర్శకుల సఫారీ వాహనం దగ్గరికి మెల్లిగా చేరుకోవడం, కొద్దిసేపటి తరువాత ఒక్క ఉదుటన దాని కిటీకి అద్దాలకు అమర్చిఉన్న రెయిలింగ్ను పట్టుకుని వేలాడుతూ ఉండటం ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
Come face-to-face with leopards in its near-natural habitat at Bannerghatta Biological Park #Bengaluru. Its the only 🐆 🐆 🐆 safari in #India!! Visit soon, except Tuesdays, before they come visit an enclave near you 🙀 pic.twitter.com/eS7FZaKR0N
— Anil Budur Lulla (@anil_lulla) October 6, 2024
ఆ సమయంలో అందులో ఉన్న సందర్శకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. గట్టిగా కేకలు వేయడం ఈ వీడియోలో రికార్డయింది. ఒకదశలో ఆ చిరుత లోనికి తలదూర్చే ప్రయత్నం చేయడం కనిపించింది. కొద్దిసేపటి తరువాత అది కిందికి దిగి తన దారిన తాను వెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని జూ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications