Sonia Gandhi: మహిళా రైతులతో సోనియా గాంధీ డ్యాన్స్.. వైరల్ అయిన వీడియో..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జులై 8న హర్యానాలోని సోనేపట్లోని మదీనా గ్రామంలో వరి పొలాలను సందర్శించిన సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆ మహిళా రైతులతో సంభాషించారు. ఆ మహిళా రైతులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని చూడాలనే కోరికను వ్యక్తం చేశారు.
లోక్సభకు అనర్హత వేటు వేయడం, న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ మహిళాలకు వివరించారు. అయితే సోనియా గాంధీ ఆ మహిళా రైతులను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. వారికి రవాణా ఏర్పాట్లు కూడా చేశారు. కాంగ్రెస్ కార్యకర్త రుచిరా చతుర్వేది వారిని హర్యానా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆదివారం సోనియా గాంధీ నివాసంలో భోజనం చేశారు. సోనియా గాంధీతో మాట్లాడారు. సోనియా మహిళా రైతులతో కలిసి డ్యాన్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను రుచిరా చతుర్వేది ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "హర్యానాకు చెందిన మహిళా రైతులు ఢిల్లీని, రాహుల్ ఇంటిని చూడాలని రాహుల్ గాంధీని కోరారు. తన ఇంటిని ప్రభుత్వం లాక్కుందని రాహుల్ చెప్పాడు" అని ట్వీట్ చేశారు. రైతులే భారతదేశానికి బలం అని, వారి మాటలు విని, వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటే దేశంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.
గాంధీ వరి పొలాలను సందర్శించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సుమారు 12 నిమిషాల యూట్యూబ్ వీడియోలో అతను రైతులు, వారి కుటుంబాలతో సంభాషించడం, పొలాలను దున్నడం, వరి నారు నాటడం ఉంది. "రైతులే భారతదేశానికి బలం" అని హిందీలో ట్వీట్ చేస్తూ, వీడియో పోస్ట్ చేశారు. "హర్యానాలోని సోనేపట్లో, నేను ఇద్దరు రైతులను కలిశాను. సంజయ్ మాలిక్, తస్బీర్ కుమార్. వారు చిన్ననాటి మంచి స్నేహితులు మరియు చాలా సంవత్సరాలు కలిసి వ్యవసాయం చేస్తున్నారు" అని రాహుల్ చెప్పారు.
Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see Delhi and his house. He told them that the Govt has taken away his house.
— Ruchira Chaturvedi (@RuchiraC) July 16, 2023
But just see what happened next.
This video is pure joy! ❤️ pic.twitter.com/1cqAeSW5xg
-
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications