‘ఫిర్యాదు వెనక్కితీసుకోకుంటే మళ్లీ రేప్ చేస్తా’
ముజఫర్నగర్: అత్యాచార బాధితురాలికి నిందితుడి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పోలీస్ స్టేషన్లో తమపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే మరోసారి అత్యాచారానికి పాల్పడతామని బాధితురాలిని రేప్ నిందితుడు ఆమెను బెదరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ జిల్లా కుర్వారాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆగస్టు 21న అంకుర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు కుటుంబసభ్యుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇంతలోనే నిందితుడి నుంచి బాధితురాలికి బెదిరింపులు వచ్చాయి. దీంతో సోమవారం మరోసారి అదే నిందితుడిపై ఫిర్యాదు చేసింది బాధితురాలు.
రెండురోజుల క్రితం రాత్రి బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను కలిసిన నిందితుడు అంకుర్.. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకుంటే మరోసారి రేప్ చేస్తానని బెదరించాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.