శిథిలాల కింద 72 గంటలు: స్లిప్పర్స్ ఏవని అడిగాడు
చెన్నై: ఓ వ్యక్తి 76 గంటల పాటు కూలిన చెన్నై భవనం శిథిలాల కింద ప్రాణాలతో ఉండిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత తన స్లిప్పర్ల గురించి వాకబు చేశాడు. సోమావరం ఉదయం 9 గంటల ప్రాంతంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ శునకం రుస్తుం ఓ చిన్నపాటి రంధ్రం వద్ద నించుని మొరగడం ప్రారంభించింది. అప్పటికి భవనం కూలి 64 గంటలు అవుతోంది.
లైఫ్ డిటెక్టర్లు, కట్టర్స్, కెమెరాలు వాడి అతన్ని రక్షించడానికి మరో 8 గంటలు పట్టింది. పసుపుపచ్చ రంగు టీ షర్ట్ ధరించిన వ్యక్తి బయటకు వచ్చాడు. తన స్లిప్పర్లు ఏవంటూ అడిగాడు. కొత్త చెప్పులు తెప్పిస్తామని ఎన్డిఆర్ఎఫ్ కమాండెంట్ ఎంకె వర్మ మర్యాదగా చెప్పాడు.

అతను ఒరిస్సాకు చెందిన 29 ఏళ్ల వికాస్ కుమార్. ఆ తర్వాత అతను ఏమీ జరగనట్లుగా నడిచిపోయాడు. దాంతో సహాయక బృందాలకు నైతిక విజయం సాధించినట్లనిపించింది. అతన్ని బయటకు తీయడానికి సహాయక బృందాలు పడిన శ్రమ ఇంతా అంతా కాదు.
ఉదయం పదకొండున్నర గంటలకు ఓ వ్యక్తి అరుపులు వినిపించాయి. అతన్ని స్పృహలో ఉంచడానికి మాట్లాడుతూ వెళ్లారు. భవనం కూలినప్పుడు తాను రెండో అంతస్థులో ఉన్నానని చెబుతూ తన మిత్రులు ఎలా ఉన్నారని అతను అడిగాడు.












Click it and Unblock the Notifications