అహ్మదాబాద్ మోడల్ కుష్బూ ఆత్మహత్య
అహ్మదాబాద్ కు చెందిన మోడల్ కుష్బూ భట్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది ఈ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకొంది.
అహ్మదాబాద్: అహ్మదాబాద్ కు చెందిన మోడల్ కుష్బూ భట్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది ఈ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకొంది.
కుష్బూ తన కుటుంబ సభ్యులతకో కలిసి జోథ్ పూర్ లోని సుకృత టవర్ లో నివసిస్తోంది. అయితే కుష్బూ ఎందుకు ఆత్మహత్య చేసుకొందో ఎలాంటి సూసైడ్ నోటు రాయలేదని పోలీసులు చెప్పారు.

కుష్బూ ఆత్మహత్యకు సంబందించిన విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆదివారం నాడు తండ్రితో కలిసి కుష్బూ మధ్యాహ్నభోజనం చేసింది.ఆ తర్వాత ఆమె తన రూమ్ లోకి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు చెప్పారు.
బోజనం చేసే సమయంలో తాను డయాబెటిక్ రోగినని తనకు ఎక్కువ బోజనం పెట్టకూడదని కుష్బూను ఆమె తండ్రి కోరారు.దీంతో ఆమె డిప్రెషన్ కు గురైందని కుటుంబసభ్యులు చెప్పారు.భోజనం ముగించిన తర్వాత ఆమె రూమ్ లోకి వెళ్ళి తాళం వేసుకొంది.అయితే పొరుగువారి సహయంతో రూమ్ తాళం పగులగొట్టి చూస్తే ఆమె ఆత్మహత్య చేసుకొందని కుటుంసభ్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications