AI Impact Summit 2026: సర్వజన హితాయ, సర్వజన సుఖాయ
రాజధాని దిల్లీలోని Bharat Mandapam వేదికగా నిర్వహించనున్న AI Impact Summit 2026పై ప్రధాని Narendra Modi హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్లో జరుగుతున్న తొలి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సదస్సు భారత్లో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సమిట్కు ప్రపంచ దేశాలు చురుకుగా పాల్గొనాలని ఆయన ఆహ్వానం పలికారు.
''సర్వజన హితాయ, సర్వజన సుఖాయ'' అనే థీమ్తో జరుగుతున్న ఈ సదస్సు, కృత్రిమ మేధస్సును ప్రపంచ సంక్షేమానికి ఉపయోగించుకోవాలనే ఉమ్మడి సంకల్పానికి ప్రతీక అని ప్రధాని తెలిపారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన పాత్రను మరింత విస్తరించేందుకు ఇది కీలక వేదిక అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

AI Impact Summit 2026: ప్రపంచానికి చాటి చెప్పాలి..
భారత యువత ప్రతిభ, దేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని ఈ సమిట్ ప్రపంచానికి చాటి చెప్పనుందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని, డిజిటల్ ప్రజా మౌలిక వసతుల విస్తరణలో భారత్ ముందంజలో ఉందన్నారు.
AI Impact Summit 2026: 45 దేశాల నుంచి ప్రతినిధులు
ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తమ తమ దేశాల ఏఐ అజెండాలను నిర్వచించుకోవడం, గ్లోబల్ సహకార అవకాశాలను అన్వేషించడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశం. శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థ, అత్యాధునిక పరిశోధనలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సమిట్ ప్రత్యేకతగా నిలవనుంది.
డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు కీలక శక్తిగా మారుతున్న వేళ, భారత్ ఈ రంగంలో నాయకత్వ పాత్ర పోషించేందుకు ముందడుగు వేస్తోందని ఈ సదస్సు స్పష్టంచేస్తోంది.
Bringing the world together to discuss AI!
— Narendra Modi (@narendramodi) February 16, 2026
Starting today, India hosts the AI Impact Summit at Bharat Mandapam in Delhi. I warmly welcome world leaders, captains of industry, innovators, policymakers, researchers and tech enthusiasts from across the world for this Summit. The…
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications