బిజెపి చీఫ్ రేస్లో షా? అదుర్స్..మోడీకి షరీఫ్ కూతురు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ కుడి భుజం, ఉత్తర ప్రదేశ్లో అత్యధిక స్థానాల్లో బిజెపి గెలిచేందుకు కృషి చేసిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్నారట. మోడీ కేబినెట్లో ఆయనకు స్థానం ఉంటుందని అందరు భావించారు. కానీ అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు ఆయన అధ్యక్షుడి రేసులో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది.
ఇప్పటి వరకూ ఈ పదవికి హిమాచల్ ప్రదేశ్కు చెందిన జెపి నద్దా పోటీలో ఉన్నారు. ఇప్పుడు నద్దాతోపాటు అమిత్ షా, ఓమ్ మాథుర్ పేర్లు కూడా అధ్యక్ష పదవికి వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినందున ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నియమానికి కట్టుబడి ఆయన రాజీనామా చేయనున్నారు.
తన స్థానంలో నద్దాను బిజెపి అధ్యక్షుడిని చేయాలని రాజ్నాథ్ సింగ్ భావిస్తున్నారు. అయితే సద్దా స్థానిక నాయకులను కలుపుకుపోరనే విమర్శలు ఉన్నాయి. ఇక, అమిత్ షా యూపిలో బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపించారు. మోడీకి సన్నిహితులు. ఇది కలిసి వచ్చే అవకాశం. అయితే అమిత్ షాను అధ్యక్షుడిగా చేస్తే ప్రధాని, పార్టీ అధ్యక్ష పదవులు రెండు గుజరాత్కే వెళ్లినట్లవుతాయి. ఇది సరికాదని కొందరు భావిస్తున్నారు.
షరీఫ్ తల్లికి మోడీ శాలువా
భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లికి శాలువా పంపించారు. దానిని చూసిన షరీఫ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల మోడీకి తల్లి హీరాబెన్ మిఠాయి తినిపించిన దృశ్యాన్ని చూసి షరీఫ్ తల్లి ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే. మోడీ శాలువా పంపడంపై షరీఫ్ కూతురు ట్విట్టర్లో స్పందించారు. నానమ్మ కోసం శాలువా పంపినందుకు మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి షరీఫ్ దానిని నానమ్మకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మోడీ పంపిన శాలువా ఫోటోను ఆమె ట్విట్టర్లో పెట్టారు.

మరియం నవాజ్ షరీఫ్
భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లికి శాలువా పంపించారు. దానిని చూసిన షరీఫ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

మరియం నవాజ్ షరీఫ్
ఇటీవల నరేంద్ర మోడీకి తల్లి హీరాబెన్ మిఠాయి తినిపించిన దృశ్యాన్ని చూసి నవాజ్ షరీఫ్ తల్లి ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే.

మరియం నవాజ్ షరీఫ్
మరోవైపు, నరేంద్ర మోడీ శాలువా పంపడంపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్ ట్విట్టర్లో స్పందించారు.

మరియం నవాజ్ షరీఫ్
నానమ్మ కోసం శాలువా పంపినందుకు మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి షరీఫ్ దానిని నానమ్మకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మోడీ పంపిన శాలువా ఫోటోను ఆమె ట్విట్టర్లో పెట్టారు.

మరియం నవాజ్ షరీఫ్
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్... నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానిహి హాజరైన విషయం తెలిసిందే. ఆహ్వానం పైన కూడా మరియం నవాజ్ షరీఫ్ స్పందించారు.

మోడీ, షరీఫ్
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్... నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానిహి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చేతులు కలిపిన దృశ్యం.












Click it and Unblock the Notifications