40 ఏళ్ల అనుభవం: అయినా తరచూ అదృశ్యం: నాడు అండమాన్, నేడు అరుణాచల్!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఆంటొనోవ్ - 32 రకానికి చెందిన తేలికపాటి విమానం అదృశ్యం కావడం కలకలం రేపింది. భారత్-చైనా సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ గగనతలంలో ఈ ఎయిర్క్రాఫ్ట్ మాయమైంది. వాయుసేనలో కీలక ప్రదేశాల్లో జవాన్లు, నిత్యావసర సరుకులను తరలించడానికి వినియోగించే ఈ విమానం ఉన్నట్టుండి గల్లంతు కావడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఇది గల్లంతు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నాలుగు దశాబ్దాల నుంచీ వాయుసేనలో..
ఆంటొనోవ్-32 ఎయిర్క్రాఫ్ట్ వైమానిక దళంలో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ఈ రకం విమానాల సేవలను వినియోగించుకుంటోంది వాయుసేన. 40 సంవత్సరాల కిందట తొలిసారిగా దీన్ని వాయుసేనలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకప్పటి సోవియట్ రష్యా ఈ రకం విమానాలను రూపొందించింది. డబల్ ఇంజిన్ ఉండటం దీని ప్రత్యేకత. సాధారణంగా ఈ రకం విమానాల్లో రెండు ఇంజిన్లు ఉండటం అరుదు.

క్లిష్ట ప్రదేశాల్లో సునాయాసంగా..
భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రదేశాలకు సైన్యాన్ని చేరవేయడం, వాయుసేన సిబ్బంది ఉండే ప్రదేశాలకు నిత్యావసర సరుకులను తరలించడానికి మాత్రమే ఈ ఎయిర్క్రాఫ్ట్ సేవలను పరిమితం చేశారు. తాజాగా- అరుణాచల్ ప్రదేశ్లో భారత్-చైనా సరిహద్దుల్లో ఉండే గస్తీ కాస్తోన్న వైమానిక దళానికి అవసరమైన సరుకులు, 13 మంది వాయుసేన సిబ్బందిని తీసుకెళ్తూ గల్లంతైంది.

మేఛుకా సమీపంలో గల్లంతు
అస్సాంలోని జోర్హాట్ బేస్ క్యాంప్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం అరుణాచల్ ప్రదేశ్లోని మేఛుకా గ్రామంలో వైమానిక దళ అవసరాల కోసం నిర్మించిన విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12:25 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉండగా.. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయినట్లు గుర్తించారు అధికారులు.

నాడు అండమాన్ వెళ్తూ..
2016లో కూడా ఇదే రకం విమానం గల్లంతైన విషయం తెలిసిందే. చెన్నైలోని తాంబరం బేస్క్యాంప్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఆంటొనోవ్-32 ఎయిర్క్రాఫ్ట్ అండమాన్ వెళ్తూ బంగాళాఖాతం గగనతలంలో అదృశ్యమైంది. ఈ విమానం జాడ ఇప్పటికీ తెలియరాలేదు. ఏమైందో తెలియదు. ఇందులో మొత్తం 29 మంది వైమానిక దళ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు మరణించినట్లుగా ప్రకటించారు అధికారులు.

ప్రతికూల పరిస్థితుల్లో రాణించలేకపోతోందా
అప్పటి నుంచీ దీని సేవలను తరచూ సందేహాలు వ్యక్తమౌతూ వస్తున్నాయి. ఈ రకం ఎయిర్ క్రాఫ్ట్ తప్ప వేరే రకానికి చెందిన విమానాలు సరుకుల రవాణా, సిబ్బంది తరలింపు విషయంలో అంతగా అనుకూలంగా లేకపోవడం వల్ల వైమానిక దళ అధికారులు దీని మీదే ఆధారపడ్డారు. తరచూ దీన్ని అప్ డేట్ చేస్తూ వస్తున్నప్పటికీ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రాణించలేకపోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications