అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇంజనీరును ఢీకొన్న ఇండిగో బస్సు, సీరియస్ !
బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్లిన ఇండిగో బస్సు ఎయిర్ ఇండియా సిబ్బందిని ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలైనాయి. వెంటనే తీవ్రగాయాలైన ఇంజనీరును ఆసుపత్రికి తరలించామని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి శివకుమార్ తెలిపారు.
ఎయిర్ ఇండియా సర్వీస్ విభాగంలో పని చేస్తున్న ఇంజనీరు విమానం ఎఐ 265 ను పరిశీలించి కిందకుదిగిన సమయంలో అటువైపు ప్రయాణికులతో వెలుతున్న ఇండిగో బస్సు వెగంగా వెళ్లి ఆయన్ను ఢీకొనింది. అనంతరం బస్సు ఇంజనీరును కొంత దూరం లాక్కోని వెళ్లిన సమయంలో తీవ్రగాయాలైనాయని ఎయిర్ ఇండియా అధికారి శివకుమార్ తెలిపారు.

ఇండిగో బస్సు చాల పెద్దదని, ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుగుతోందని ఎయిర్ ఇండియా సిబ్బంది అంటున్నారు. ఇక ముందు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.
బస్సు డ్రైవర్ కావాలని ఇంజనీరును ఢీకొనలేదని అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎవ్వరూ సంచరించరని, ఆ ప్రాంతంలో సంచరించే బస్సులు వేగంగా నడుస్తుంటాయని, ఆకస్మికంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications