ఆంధ్రా బ్యాంకుకు కుచ్చు టోపి: ఐదుగురికి జైలు శిక్ష
థానె: నకిలి డాక్యుమెంట్లు తయారు చేసి ఆంధ్రా బ్యాంకులో సమర్పించి హోం లోన్ తీసుకుని మోసం చేసిన వారిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఐదుగురిలో దంపతులు కూడా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.
ప్రశాంత్ బాగ్వే, ప్రతిజ్ఞా బాగ్వే (దంపతులు), రవిపాటిల్, సంకేత్ కాంబ్లే, అజయ్ ఆంగ్రే అనే ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. వీరి నుండి పలు డాక్యుమెంట్లు, నకిలీ రబ్బర్ స్టాంప్ లు స్వాధీనం చేసుకున్నారు.

థానె లోని డొంబివాలి ప్రాంతంలో ఉన్న వీనస్ కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో తాను ఒక ప్లాట్ కొన్నానని ప్రశాంత్ బాగ్వే నకిలీ డాక్యూమెంట్లు సృష్టించాడు. తరువాత ప్రభుత్వానికి చెందిన నకిలి రబ్బర్ స్టాంప్ లు తయారు చేయించాడు. డాక్యూమెంట్లు, రబ్బర్ స్టాంప్ లతో కొన్ని నకిలి పత్రాలు తయారు చేశాడు.
వాటిని తీసుకు వెళ్లి ఆంధ్రా బ్యాంకులో సమర్పించి రూ. 10 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ప్రశాంత్ బాగ్వేకి అతని, భార్య, మిగిలిన వారు సహకరించారు. అదే విధంగా సంజయ్ అఖాడే అనే వ్యక్తికి ఇలాంటి డాక్యుమెంట్లు ఇచ్చి రూ. 60 వేలు తీసుకున్నారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఈ ఐదుగురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications