బోరుబావిలో పడి మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి ..
చండీగఢ్ : యాజమానుల నిర్లక్ష్యం పసిప్రాణాల పాలిట శాపమవుతున్నాయి. కొందరు తమ భూమిలో వేస్తోన్న బోర్లు ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఎన్ని ఘటనలు జరిగినా .. యాజమానుల్లో భయం, అధికారుల్లో చలనం లేకుండా పోయింది. పంజాబ్లో ఓ బాలుడు పడి 24 గంటలైనా తీయకపోవడంతో.. ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు
పంజాబ్లోని సంగరూర్ జిల్లాలో గల బోరుబావిలో ఫతేవీర్ సింగ్ అనే రెండేళ్ల బాలుడు నిన్న సాయంత్రం పడిపోయాడు. అక్కడ బోరువేశారు .. అయితే నీళ్లు పడకపోవడంతో బట్ట కప్పి ఉంచారు. ఇంతలో ఆటుగా ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అందులో పడిపోయాడు. విషయం తెలిసి బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ బావి లోతు 150 అడుగులు ఉండగా .. 125 అడుగుల లోతులో బాలుడి ఇరుక్కుపోయాడని అధికారలు గుర్తించారు. బాలుడిని బయటకు తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీలతో సమాంతరంగా మరో గోతిని తవ్వుతున్నారు. అయితే బాలుడి పడి ఒకరోజు పూర్తవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ గొట్టల ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
బాలుడిని బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ నిపుణుగుల కూడా రంగంతోకి దిగారు. బోరుబావికి సమాంతరం మరో గుంత తవ్వుతున్నారు. కొంచెం లోతు వెళ్లకా .. పైపు ద్వారా బాలుడిని బయటకు తీస్తామని అధికారులు చెప్తున్నారు. బోరుబావి లోపలికి ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే 24 గంటలు గడిచిపోవడంతో బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ బాలుడిని కాపాడేందుకు అధికారులు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications