‘స్వేచ్ఛగా పని చేసుకోనివ్వండి’: మోడీకి ఢిల్లీ సిఎం కేజ్రివాల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పని చేసుకోనివ్వండని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఓ లేఖ రాశారు. ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అరవింద్ కేజ్రివాల్కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగున్న నేపథ్యంలో కేజ్రివాల్ ప్రధాని మోడీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతేగాక, కేంద్ర ప్రభుత్వంపైనా కేజ్రివాల్ తన లేఖలో ధ్వజమెత్తారు. లెఫ్ట్నెంట్ గవర్నర్ ద్వారా కేంద్రప్రభుత్వం ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోందని ఆరోపించారు. బ్యూరోక్రాట్స్ బదిలీలపై జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
కాగా, మంగళవారం ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్, సిఎం కేజ్రివాల్లు వేర్వేరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. వారి అధికార పరిధుల అతిక్రమణపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఢిల్లీలో ‘రాజ్యాంగ సంక్షోభ తరహా పరిస్థితి' తలెత్తేలా ఉందని జంగ్ ఫిర్యాదు చేయగా, ప్రతీ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇంకెందుకని కేజ్రివాల్ రాష్ట్రపతి ముందు వాదనలు వినిపించినట్లు తెలిసింది.

తాజాగా ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా రాజేంద్ర కుమార్ స్థానంలో అరవింద్ రేని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఎన్నికల ద్వారా ఏర్పడిన ఢిల్లీ ప్రభుత్వంలో లెఫ్ట్నెంట్ గవర్నర్ జోక్యం బాగా పెరిగిపోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఢిల్లీ సిఎం కేజ్రివాల్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. కేజ్రివాల్ తన ‘ధర్నా మైండ్సెట్'ను మార్చుకోవాలని కోరారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, మిగితా రాష్ట్రాల్లోలాగా ముఖ్యమంత్రికి అన్ని అధికారాలుండవని చెప్పారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications