ఆ ఏటిఎంలో 100 కోడితే 500.. 5వేలు వచ్చాయి!
జైపూర్: ఆ ఏటిఎంలో అంతా విచిత్రమే. రూ. 100 కొడితే 500 వస్తాయి. రూ. 500 కొడితే 5వేల నగదు వస్తుంది. ఇంకేముందు ఆ ఏటిఎం ముందు జనం బారులు తీరారు. ఆ ఏటిఎంలో ఐదు రేట్లు ఎక్కువగా నగదు తీసుకుని సంబరపడిపోయారు. ఆ ఏటిఎం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని సికార్ జిల్లాలోని అజిత్గఢ్ ప్రాంతంలో ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎం నుంచి కావాల్సిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ విషయం క్షణాల్లో బయటకురావడంతో స్థానికులంతా ఆ ఏటీఎం ముందు బారులు తీరారు.

దీంతో సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకుని ప్రజలను అడ్డుకున్నారు. బ్యాంకు యాజమాన్యానికి సమాచారమందించారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో అప్పటికే అనేక మంది డబ్బులు డ్రా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం ఏటీఎంకు తాళం వేసి కానిస్టేబుల్ను నియమించారు. ఏటీఎంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయని.. ఏటీఎంను సరిచేస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications