వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫీస్‌పై దాడి: భద్రత వద్దేవద్దని కేజ్రీవాల్, అసభ్య ప్రవర్తన

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను కానీ, తమ పార్టీ నేతలు కానీ భద్రత విషయమై పునరాలోచించేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం పునరుద్ఘాటించారు. ఉదయం కొందరు ఎఎపి కార్యాలయం పైన దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ సంఘటన తర్వాత కూడా భద్రత విషయంలో పునరాలోచన లేదని చెప్పారు. దాడి సమయంలో ఎఎఫి కార్యాలయం వద్ద కనీస భద్రత మాత్రమే ఉందని చెప్పారు.

 Attack on AAP office

కాగా, హిందూ రక్షా దళ్ పేరుతో బ్యానర్లు పట్టుకొని కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న ఆప్ కార్యాలయంపై ఉదయం పలువురు దాడి చేశారు. రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు పగులగొట్టారు. కార్యాలయ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. ఎఎఫి నేత ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్ పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగింది.

2011లో కూడా ఇదే గ్రూప్ తన కార్యాలయం పైన దాడి చేసిందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేనని ఆయన ఆరోపించారు.

English summary
Arvind Kejriwal today said he or his AAP would not reconsider their refusal to take security after an attack this morning on the party's office that AAP leader Prashant Bhushan has blamed on the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X