మతమార్పిడి: గుండి కొట్టించి గాడిదపై ఊరేగించారు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో శుక్రవారం జరిగిన ఓ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముగ్గురు హిందువులను బలవంతంగా మత మార్పిడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని అతిదారుణంగా అవమానించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఒరాయ్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, జలావున్ జిల్లా రాందర్ కు చెందిన అద్వేశ్ సవిత అనే వ్యక్తి ఇటీవల ఓ ముగ్గురు హిందువులను క్రైస్తవ మతంలోకి చేర్పించారు. అంతేకాదు వారితో గోమాంసాన్ని వారితో బలవంతంగా తినిపించాడని సమాచారం అందుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు.

దాదుపు 200 మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు అద్వేశ్ సవిత ఇంటిపై దాడి చేశారు. అతన్ని ఇంటి నుంచి బయటకు లాక్కుని వచ్చారు. అనంతరం జిల్లాలోని ఒరాయ్ పట్టణానికి తీసుకొచ్చారు. గుండు గీసి, మీసాలు, కను బొమ్మలు సైతం తీసి వేయించారు. అనంతరం మెడలో చెప్పుల దండ వేసి పట్టణంలో గాడిపై ఊరేగించారు.
పట్టపగలే ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. ఊరేగింపు తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ సంఘటపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన జలావున్ ఎస్పీ దీనిపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications