బెంగళూర్ రేప్: ఒక్కరి అరెస్టు, తెరుచుకున్న స్కూల్
బెంగళూర్: మూడేళ్ల బాలికపై అత్యాచారం వివాదం నేపథ్యంలో మూతపడిన బెంగళూర్లోని పాఠశాల సోమవారం తెరుచుకుంది. మూడేళ్ల బాలికపై అక్టోబర్ 21వ తేదీన అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు జరిగిన ఉదంతంపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి పాఠశాల నడవడం లేదు.
బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు శనివారంనాడు పురోగతి సాధించారు. దర్యాప్తులో బాలిక గుర్తు పట్టడంతో పోలీసులు గుండప్పను అరెస్టు చేశారు. ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫీస్ అసిస్టెంట్ గుండప్పను (45)ను అరెస్టు చేశామని, దర్యాప్తు సందర్భంగా ఫొటో చూసి బాలిక అతన్ని గుర్తుపట్టిందని బెంగళూర్ పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

గత రెండేళ్లుగా అతను పాఠశాలలో పనిచేస్తున్నట్లు యాజమాన్యం నుంచి పోలీసులు తెలుసుకున్నారు. ప్రత్యేకమైన ఏజెన్సీ ద్వారా నిందితుడి గుర్తింపు ప్రక్రియ పిక్చర్ ద్వారా జరిగిందని, మెజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలం నమోదు చేశామని రెడ్డి చెప్పారు.
తీవ్రమైన బాధ నుంచి కోలుకోలేదని, బాలిక చాలా చిన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బాలిక నుంచి ఎక్కువ సమాచారం సేకరించలేదని ఆయన చెప్పారు. ఇది అత్యంత సున్నితమైన కేసు అని, బాధితురాలి నుంచి ఎక్కువ సాక్ష్యాలు సేకరించలేకపోయామని ఆయన అన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున, కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ వివరాలు వెల్లడించలేమని ఆయన చెప్పారు.
పిల్లల భద్రతకు, రక్షణకు రెడ్డి తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన తర్వాత సోమవారం నుంచి పాఠశాల నడవడానికి పోలీసులు అనుమతించారు. పాఠశాల కార్యదర్శి కెఆర్కె రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల సొసైటీకి చెందిన మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఆ ముగ్గురికి కూడా విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసినట్లు పోలీసు కమిషనర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సరైన గుర్తింపు లేకుండా నడుపుతున్నట్లు వారిపై ఆరోపణలు వచ్చాయని రెడ్డి చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications