Bihar Election 2020: తొలి దశ ప్రశాంతం - 53.54 శాతం పోలింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగింది. నిర్ణీత గడువు ముగిసే సమయానికి మొత్తం 53.54 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్తో పోల్చుకుంటే ఈ సారి ఓటింగ్ స్వల్పంగా తగ్గింది. 2015లో జరిగిన ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్లో 54.94 శాతం పోలింగ్ నమోదు అయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్లో 53.54 నమోదైంది.
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తొలి దశలోని 71 నియోజకవర్గాల్లో 53.54 శాతం పోలింగ్ రికార్డయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మారుమూల ప్రాంతాల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని, గురువారం ఉదయం నాటికి పూర్తి స్థాయిలో లెక్కలు వెల్లడిస్తామని పేర్కొంది. కరోనా నేపథ్యంలో నిర్వహించిన తొలి ఎన్నికలు కావడంతో ఈసీ ఈసారి అనూహ్య ఏర్పాట్లు చేసింది.

బీహార్ లో గత(2015) అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 56.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా దాదాపు అంతే శాతం పోలింగ్ నమోదు కావొచ్చని అంచనాలున్నాయి. మొదటి దశలో 53.54 శాతం ఓటింగ్ నమోదైనప్పటికీ, నవంబర్ 3న జరిగే రెండో దశ, నవంబర్ 7న జరిగే మూడో దశలో పోల్ శాతం పెరిగే అవకాశముంది. నితీశ్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఈసారి ఓటింగ్ శాతం పెరగొచ్చన్న అంచనాలు తప్పని లేలాయి. అయితే ఫలితాలు ఎలా ఉంటాయనేది నవంబర్ 10న తేలనుంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications