Bihar Election 2020: తొలి దశ ప్రశాంతం - 53.54 శాతం పోలింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగింది. నిర్ణీత గడువు ముగిసే సమయానికి మొత్తం 53.54 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్తో పోల్చుకుంటే ఈ సారి ఓటింగ్ స్వల్పంగా తగ్గింది. 2015లో జరిగిన ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్లో 54.94 శాతం పోలింగ్ నమోదు అయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్లో 53.54 నమోదైంది.
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తొలి దశలోని 71 నియోజకవర్గాల్లో 53.54 శాతం పోలింగ్ రికార్డయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మారుమూల ప్రాంతాల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని, గురువారం ఉదయం నాటికి పూర్తి స్థాయిలో లెక్కలు వెల్లడిస్తామని పేర్కొంది. కరోనా నేపథ్యంలో నిర్వహించిన తొలి ఎన్నికలు కావడంతో ఈసీ ఈసారి అనూహ్య ఏర్పాట్లు చేసింది.

బీహార్ లో గత(2015) అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 56.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా దాదాపు అంతే శాతం పోలింగ్ నమోదు కావొచ్చని అంచనాలున్నాయి. మొదటి దశలో 53.54 శాతం ఓటింగ్ నమోదైనప్పటికీ, నవంబర్ 3న జరిగే రెండో దశ, నవంబర్ 7న జరిగే మూడో దశలో పోల్ శాతం పెరిగే అవకాశముంది. నితీశ్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఈసారి ఓటింగ్ శాతం పెరగొచ్చన్న అంచనాలు తప్పని లేలాయి. అయితే ఫలితాలు ఎలా ఉంటాయనేది నవంబర్ 10న తేలనుంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications