వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీదే మళ్లీ అధికారం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ జోస్యం

|
Google Oneindia TeluguNews

లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. ఈసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పీఠమెక్కబోతున్నారని జోస్యం చెప్పారు. లక్నో లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక స్కాలర్స్ స్కూల్‌లో సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూ లో నిలబడి ఓటేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు.

<strong>ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్</strong>ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్

రెండు దశాబ్ధాలుగా లక్నోలో బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1991లో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇక్కడి నుంచే గెలుపొందారు. అలా అప్పటినుంచి ఇక్కడ బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. ఈసారి బీజేపీ తరపున రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్, ఎస్పీ బీఎస్పీ కూటమి నుంచి శత్రుఘ్నసిన్హా భార్య పూనమ్ పోటీపడుతున్నారు.

BJP Will Get Clear Majority Rajnath Singhs Confident Message After Voting
English summary
BJP Will Get Clear Majority Rajnath Singhs Confident Message After Voting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X