దావుద్ ఇబ్రహీంతో లవ్ లో పడిన బాలయ్య హీరోయిన్, ఆ ఫోటోలు వైరల్ కావడంతో ఏం చేసిందంటే ?
చాలా విషయాల్లో ఎన్నో వివాదాలు సృష్టించిన వ్యక్తి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం. దావూద్ ఇబ్రహీం హాబీలు కొన్నిసార్లు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. దావూద్ ఇబ్రహీం ప్రేమకథ కూడా చాలా బలంగా వైరల్ అయ్యాయి. ఇంతకీ దావూద్ తో లవ్ లో పడిన ఆ బ్యూటీ పేరు ఏమిటి ?, ఆ బాలీవుడ్ నటి జీవితంలో తర్వాత ఏం జరిగింది ? అని చర్చ మొదలైయ్యింది.
దావుద్ ఇబ్రహీం హీరోయిన్ ఎవరు అని చాలా మంది ఆసక్తిగా సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ఇప్పుడు విష ప్రయోగం జరిగిందని వార్తలు వచ్చాయి. పాకిస్థాన్లోని కరాచీలోని ఓ ఆస్పత్రిలో డాన్ దావూద్ ఇబ్రహీంను చేర్పించారని, దావూద్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్నాడని సమాచారం అందింది. ఈ మధ్య దావూద్ ఇబ్రహీం కడుపులో విషం దొరికిందన్న ప్రచారం జరుగుతోంది.

వీటన్నింటి మధ్య దావూద్ ఇబ్రహీం, బాలీవుడ్ నటి మధ్య ప్రేమకథపై హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ఇంతకీ ఆ బాలీవుడ్ నటి ఎవరు? అనే టాపిక్ లోకి వెలితే ఆ హీరోయిన్ ఎవరో కాదు, నందమూరి బాలక్రిష్ణతో రొమాన్స్ చేసిన హీరోయిన్. రామ్ తేరీ గంగా మైలీ అనే బాలీవుడ్ చిత్రం బాలీవుడ్ యార్డ్లో ఎన్నో రికార్డులను లిఖించింది. ఈ సినిమా ద్వారా నటి మందాకిని బి-టౌన్ యార్డ్లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
అలా నటి మందాకినికి కొత్త హోదా వచ్చిన కొంతకాలానికే బాలీవుడ్ హీరోయిన్ మందాకిని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసిపోయింది. మందాకిని దావూద్తో కలిసి ఉన్న ఫోటో వైరల్గా మారడంతో బాలీవుడ్ షేక్ అయ్యింది. తరువాత మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, బాలీవుడ్ హీరోయిన్ మందాకిని ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా వార్తలు వచ్చాయి.

అలా 26 ఏళ్ల క్రితం రాజ్ కపూర్ బాలీవుడ్ కు పరిచయం చేయాలని మందాకినిని గుర్తించి రామ్ తేరీ గంగా మైలీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ద్వారా నటి మందాకిని బాలీవుడ్ యార్డ్ మొత్తం తిరిగేలా చేసింది. ఆ తర్వాత నటి మందాకినితో సినిమాలు తియ్యాలని అనుకున్న బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు క్యూలు కట్టి మందాకిని ఇంటి ముందు మకాం వేశారు.
బాలీవుడ్ హీరోయిన్ మందాకిని అందానికి సినీ అభిమానులు కూడా మంత్రముగ్ధులయ్యారు. అయితే ఆ తర్వాత మాత్రం అందుకు రివర్స్ లో జరిగింది. దావూద్ ఇబ్రహీంతో కలిసి బాలీవుడ్ నటి మందాకి ఫోటోలు వైరల్ కావడం ప్రారంభించాయి. ఆ దెబబతో నటి మందాకిని బాలీవుడ్ సినీ పరిశ్రమకు దూరంగా ఉండటం ప్రారంభించింది. బాలీవుడ్ లో అగ్రనటిగా ఉన్న నటి మందాకిని సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. అప్పటికి దావుద్ ఇబ్రహీం, మందాకిని విషయం కూడా బాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా రచ్చరచ్చ చేసింది.

దావూద్ ఇబ్రహీం రెండు రోజుల క్రితమే కరాచీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. దావూద్ ఉన్న ఆసుపత్రికి భారీగా పోలీసుల భద్రత కల్పించినట్లు సమాచారం. దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న కరాచీ హాస్పిటల్ ఫ్లోర్లో ఇతర రోగులను ఉంచలేదు. అందరినీ ఖాళీ చేసి అదే ఫ్లోర్లో డాన్ దావూద్కు చికిత్స అందిస్తున్నారు.
దీంతో దావూద్ ఇబ్రహీం ఉన్న ఆస్పత్రిలోని ఫ్లోర్లోకి ఆస్పత్రి వైద్యులు, కుటుంబసభ్యులు తప్ప మరెవ్వరినీ అనుమతించడం లేదని చెబుతున్నారు. నందమూరి బాలక్రిష్ణ హీరోగా నటించిన భార్గవరాముడు అనే సినిమాలో మందాకిని హీరోయిన్ గా నటించింది. ఇదే సినిమాలో రాధా కూడా హీరోయిన్ గా నటించింది. తరువాత తెలుగు సినిమాల్లో వరుసగా చాలా అవకాశాలు వచ్చినా మందాకిని మాత్రం దావుద్ ఇబ్రహీంతో లవ్ లో పడి సినిమా ప్రపంచానికి దూరం అయ్యింది.












Click it and Unblock the Notifications