అచ్చం అలాగే: స్కూల్లో బాలుడిపై కత్తితో దాడి, బాలిక పనేనా...
లక్నో: ఒకటో తరగతి బాలుడిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో పాఠశాలలోని టాయిలెట్లో దాడి జరిగింది. సీనియర్ విద్యార్థిని అతనిపై కత్తితో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. గుర్గావ్లోని రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన జరిగినట్లుగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆరేళ్ల బాలుడి ఛాతీలో, కడుపులో తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే, అతని ప్రాణాలకు ముప్పు లేదని భావిస్తున్నారు. బ్రైట్ల్యాండ్ స్కూల్లో తన కుమారుడిపై ఓ బాలిక దాడి చేసిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఆరో తరగతి చదువుతున్న ఆ బాలిక కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. తమ కుమారుడికి గాయాలయ్యాయని, అతనిపై కత్తితో దాడి జరిగిందని పాఠశాల వర్గాలు తమకు చెప్పనట్లు బాలుడి తండ్రి చెప్పారు
దాడి చేనిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది. దాడి చేసింది స్టూడెంటా, కాదా అనేది నిర్ధారించుకోవాల్సి ఉంది. బ్లూ వేల్ ప్రభావం ఈ దాడికి కారణమా అనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
పాఠశాల నుంచి గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు కనిపిస్తోందని చికిత్స చేస్తున్న వైద్యుడు చెప్పారు. రియాన్ స్కూల్ సంఘటన నేపథ్యంలో తాము అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, బ్లూ వేల్ చాలెజ్ గేమ్ ప్రభావం ఏమైనా ఉందా అనేది పరిశీలిస్తున్నామని స్కూల్ డైరెక్టర్ వీణ వ్యాస్ చప్పారు.
పాఠశాలలోని 70 సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండు తరగతి విద్యార్థి ప్రద్యున్ ఠాకూర్ వాష్ రూంలో గొంతు కోయడం వల్ల మరణించిన విషయం తెలిసిదే. అదే పాఠశాలకు చెందిన 16 బాలుడిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా గుర్తించారు.