సెల్ఫోన్ కొనివ్వలేదని అక్కా, బావను కాల్చి చంపాడు
ఐజ్వాల్: మొబైల్ ఫోన్ కొనివ్వలేదనే కోపంతో సొంత అక్కను, బావను సింగిల్ బ్యారెల్ తుపాకీతో కాల్చి చంపాడు ఓ పదహారేళ్ల యువకుడు. ఈ దారుణ ఘటన మిజోరం రాష్ట్రం ఐజ్వాల్ జిల్లాలో జులై 7న చోటుచేసుకుంది. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి రూ.36 వేలు ఎత్తుకెళ్లాడు.
కాగా, జువెనైల్ జస్టిస్ బోర్డు జరిపిన విచారణలో బాలుడు నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొబైల్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వడానికి సోదరి నిరాకరించింది. దీంతో నిందితుడు తన అక్కతో గొడవపడ్డాడు.
ఎంతకూ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన యువకుడు జంతువులను వేటాడటానికి ఉపయోగించే తుపాకీతో అక్కను, బావను కాల్చేశాడు. అంతటితో ఆగకుండా గొడ్డలితో నరికాడని ఐజ్వాల్ జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా ఆ దంపతులకు ఇటీవలే రూ.66 వేలు లభించాయని.. అందులో కొంత ఖర్చు చేశారని, మిగితా రూ.30 రూపాయలతో ఫోన్ కొనివ్వాలని నిందిత యువకుడు గొడవపడ్డాడని పోలీసులు చెప్పారు.