వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మద్యం మత్తులో 2,000 ఫీట్ల లోయలో పడి స్నేహితులు మృతి (వీడియో)
మహారాష్ట్రలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు 2,000 ఫీట్ల లోయలో పడి చనిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అంబోలీఘాట్లో చోటు చేసుకుంది.
ముంబై: మహారాష్ట్రలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు 2,000 ఫీట్ల లోయలో పడి చనిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అంబోలీఘాట్లో చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. అధికారులు అంత లోతున గల లోయలో నుంచి రిస్క్ తీసుకొని మృతదేహాలను పైకి తీసుకు వచ్చారు.
మృతులు కొల్హాపూర్కు చెందిన ప్రతాప్, ఇమ్రాన్లుగా గుర్తించారు. అంబోలి ఘాట్ మంచి పిక్నిక్ పాయింట్. ఈ సంఘటన ఆగస్ట్ 1వ తేదీన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇమ్రాన్ గారడి (26), ప్రతాప్ రాథోడ్ (2), మరో ఏడుగురితో కలిసి వ్యాలీకి వెళ్లారు. మద్యం మత్తులో ఇది చోటు చేసుకుంది. మృతులు, వారి స్నేహితులు కొల్హాపూర్లోని ఓ పౌల్ట్రీ ఫాంలో పని చేస్తున్నారు.
Comments
English summary
Two revellers died after falling into a 2,000 feet deep valley in Amboli Ghat in Sindhudurg district of Maharashtra. A video of their fall has gone viral on social media.