గూగుల్కు రూ. 136కోట్ల భారీ జరిమానా విధించిన సీసీఐ
న్యూఢిల్లీ: ప్రఖ్యాత సెర్చింజన్ సంస్థ గూగుల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది. గూగుల్కు భారత్ రూ. 136 కోట్ల జరిమానా విధించింది. ఇతర పోటీదారులు, వినియోగదారులకు నష్టం చేకూర్చేలా గూగుల్ ప్రవర్తించినట్లు సీసీఐ పేర్కొంది.
గూగుల్పై అనుచిత వ్యాపార ధోరణుల కేసు 2012లో దాఖలయింది. కాగా, గూగుల్కు చెందిన ఆల్ఫాబెల్ కంపెనీ వెబ్సెర్చ్లో, అడ్వర్టెయిజ్మెంట్స్లో పైచేయి సాధించేందుకు యత్నించినట్లు తెలిపింది.

దీనివల్ల పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారని చెప్పింది. అందుకే ఈ జరిమానా విధించినట్లు వెల్లడించింది. అరవై రోజుల్లోగా గూగుల్ జరిమానాను చెల్లించాల్సివుంటుందని చెప్పింది.
కేసును అన్ని కోణాల నుంచి సునిశితంగా పరిశీలించిన తర్వాతే జరిమానా విధింపు నిర్ణయం తీసుకున్నట్టు సీసీఐ వివరించింది. కాగా, ఇలాంటి అభియోగంపై గూగుల్ జరిమానా భరించాల్సివచ్చిన అరుదైన కేసు కావడం గమనార్హం.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications