జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్ - రెండు విడతల్లో రాష్ట్రాల వారీగా ఇలా..!
దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇప్పటికే తీసుకున్న కేబినెట్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా జన గణనలోనే భాగంగా కుల గణన కూడా చేపట్టనున్నారు. దేశంలో రెండు విడతలుగా ఈ జనాభా గణన ప్రక్రియ చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో జన గణన మొదలు కానుండగా.. మిగతా రాష్ట్రాల్లో 2027లో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశంలో చేపట్టే జనగణన ముందుగా వచ్చే ఏడాది అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చేపడతారు. అలాగే 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. అలాగే ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. నిన్న జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈ తేదీల్ని ఖరారు చేశారు.

Reviewed the preparations for the 16th Census with senior officials.
— Amit Shah (@AmitShah) June 15, 2025
Tomorrow, the gazette notification of the census will be issued. The census will include caste enumeration for the first time. As many as 34 lakh enumerators and supervisors and around 1.3 lakh census… pic.twitter.com/wkvJda7J4e
జనాభా గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ముందుగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపడతారు. ఇందులో ప్రతి ఇంటి గృహ పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల గురించి సమాచారం సేకరిస్తారు. అనంతరం రెండవ దశలో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి యొక్క జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు. ఈ దశలో ఒక వ్యక్తి యొక్క కులం గురించి సమాచారం కూడా తీసుకుంటారు. దేశంలో సుదీర్ఘ విరామం తర్వాత ఇలా జనాభా గణనలో కుల గణనను కూడా చేపట్టబోతున్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications