సరిహద్దులో టెన్షన్: చైనా వెనుకడుగు -ఎల్ఏసీ నుంచి 10వేల మంది వాపస్ -అసలు రీజన్ ఇదే..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. చలికాలంలో యుద్ధానికి సై అంటూ రెండు దేశాలూ భారీ ఎత్తున బలగాలను, ఆయుధ సంపత్తిని మోహరించాయి. ప్రధానంగా తూర్పు లదాక్ ప్రాంతంలో ఫేస్ టు ఫేస్ తరహా పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. అయితే..
ఇటీవల తూర్పు లదాక్ సమీపంలోని ఎల్ఏసీకి సమీపంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. ఇండియాతో యుద్ధం కోసం చైనా మోహరింపజేసిన బలగాల నుంచి దాదాపు 10వేల మంది జవాన్లను వెనక్కి పిలిపించుకున్నట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ పరిణామం ఎల్ఏసీకి 150 కిలోమీటర్ల పరిధిలో చోటుచేసుకుందని, రేఖ వద్ద మాత్రం పరిస్థితి టెన్షన్ గానే ఉందని పేర్కొన్నాయి.

ఇండియాతో యుద్ధానికి దాదాపుగా సన్నద్ధమైన చైనా.. సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో భారీ ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసి, దాదాపు 50 వేల మంది జవాన్లను అక్కడ నిలిపి ఉంచింది. భారత్ సైతం అదే సంఖ్యలో జవాన్లను సరిహద్దుకు తరలించింది. తాజాగా చైనా తన బలగాల నుంచి 10 మందిని ఉపసంహరించుకుంది. కాగా
లదాక్ సహా ఎల్ఏసీ ప్రాంతంలో విపరీతమైన చలి కారణంగానే చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండటం, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ట్రూప్స్ ప్రయాణం కష్టతరం అవుందని, అందుకనే చైనా తన దళాలను వెక్కు తీసుకుందని తెలుస్తోంది. అయితే, మళ్లీ వేసవిలోగా చైనా తన బలగాలను తిరిగి రప్పించినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆర్మీ వర్గాలు వ్యాఖ్యానించాయి.
రెండు దేశాల మధ్య 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రికతల్లో ఒకసారి రక్తపాతం, రెండు మూడు సార్లు తుపాకి కాల్పులు చోటుచేసుకున్నాయి. స్టేటస్ కో ఏర్పడేలా రెండు దేశాల సైనిక, దౌత్య అధికారులు పలు మార్లు చర్చలు జరిపినా ఫలితం రాలేదు. ప్రస్తుతం ఎల్ఏసీలోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలు, రేజాంగ్ లా తదితర ప్రాంతాలపై భారత్ పట్టు కొనసాగిస్తున్నది.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications