Delhi Air pollution:ప్రాణాలపై తీపి ఉంటే అటు వెళ్లకండి..!
ఢిల్లీ: ఢిల్లీ నగరానికి ఏమైంది.. ఎటు చూసినా కాలుష్యమే. ఆ నగరమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. రోజు రోజుకూ కాలుష్య తీవ్రత మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో అక్కడి ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. అయితే దీనికి కారణం మానవ తప్పిదమే అనేది స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఎక్కడా అడ్డుకట్ట వేయలేక పోతున్నాం.
గురువారం ఉదయం ఢిల్లీ నగరం దట్టమైన కాలుష్యంతో నిద్ర లేచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ప్రమాదపుటంచులను తాకినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఇలా తీవ్ర స్థాయిలో కాలుష్యం నగరాన్ని కుదిపేయడం వరుసగా ఇది ఏడో రోజని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది.

గురువారం ఉదయం 7 గంటలకు బావనా ప్రాంతంలో గాలి నాణ్యత 442 పాయింట్లుగా నమోదుకాగా, ఆర్కే పురం 418, జహంగీర్పురీ 441, ద్వారకా 416,అలీపూర్ 415, ఆనంద్ విహార్ మరియు ఐటీఓ 412, ఢిల్లీ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత 401గా రికార్డు అయ్యింది.
#WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category.
— ANI (@ANI) November 16, 2023
(Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ
ఇండియాగేట్ వద్ద ప్రజలు మాస్కులు ధరించి వ్యాయామం చేస్తున్న వీడియోలు ఒక్కింత కలవరపాటుకు గురిచేశాయి. ఈ కాలుష్యంలో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందంటూ ఓ అథ్లెట్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బయటమాత్రమే ట్రైనింగ్ ఇస్తానని అలాంటప్పుడు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు.
ఇదిలా ఉంటే ఢిల్లీకి వచ్చి శ్వాస తీసుకోవడమంటే.. పొగను లోపలికి పీల్చుకున్నట్లే ఉందని ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడు. ప్రభుత్వం సత్వరమే తగు చర్యలు తీసుకుని పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశాడు. సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీని చూసేందుకు వస్తున్న తమకు కాలుష్యం వేటుకు బలవుతున్నామని తమ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వెలిబుచ్చాడు.
#WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in the 'Severe' category.
— ANI (@ANI) November 16, 2023
(Drone visuals from the area around ISBT, shot at 7.45 am) pic.twitter.com/32xZ5hviEI
దీపావళి పండగ తర్వాత దేశంలోని 11 రాష్ట్ర రాజధాని నగరాల్లో 9 రాజధాని నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాయని ఓ విశ్లేషణ పేర్కొంది. ఇక ఢిల్లీలో కాలుష్య తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు చేపడుతున్నామని చెప్పారు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. కాలుష్య తీవ్రత మరింత ప్రమాదకర స్థాయికి చేరితే కృత్రిమ వర్షాలు, సరి-బేసి సంఖ్య ట్రాఫిక్ విధానం అమలు చేస్తామని వివరించారు. రానున్న మూడు రోజుల్లో పరిస్థితిని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.
-
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications