మిషన్ శక్తి క్రెడిట్ ఎవరిది ? బిజేపి or కాంగ్రెస్ సైంటీస్టులను అవమానిస్తున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడి మిషన్ శక్తి పై ప్రకటన చేసిన తర్వాత రాజకీయ వాతవరణం వేడెక్కింది, మిషన్ శక్తి , క్రెడిట్ ను స్వంతం చేసుకునేందుకు బిజేపి ,కాంగ్రెస్ పార్టీలు పోటి పడుతున్నాయి.దీంతో ఓకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు.

స్పెస్ క్లబ్ లో చేరిన ఇండియా ; మోదీ
స్పేస్ శక్తిలో అంత్యంత్య శక్తివంతమైన మూడు దేశాల తర్వాత నాల్గవ దేశంగా భారత్ చేరిందని ప్రధాని నరేంద్రమోడి ప్రకటించారు. డిఆర్డీఏ శాస్త్రవేత్తలు సాధించిన విజయంపై ఆయన ప్రశంశల వర్షం కురిపించారు. దీంతో అటు చైనాకు ఇటు ప్రత్యర్థి దేశాలకు భారత్ సత్తా చాటారని మోది చెప్పారు.ఇది బిజేపి హయాంలో సాధించిన విజయంగా మోదీ చెప్పకపోయినా, ఎన్నికల సమయంలో మోది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన స్వయంగా ప్రకటించారు.అంతకు ముందు ఈ విషయాన్ని ప్రకటించడం కోసం మోడి మరో అర్ధగంటలో మీడీయాతో ముఖ్యమైన విషయం పై మాట్లాడతారని ట్వీట్ పెట్టడడంతో, మీడియా సంస్థలతో పాటు ప్రజలు అంత్యంత అసక్తిగా ఎదురు చూశారు,

కౌంటర్ అటాక్ రాహుల్
అయితే భారత అంతరిక్ష శాటిలైట్ తయారి వ్యవస్థ1962 లోనే నేహ్రు హయాంలో ప్రారంభమైందని ,ఇది కాంగ్రెస్ క్రెడిట్ అని కాంగ్రెస్ నేతలు పేర్కోన్నారు.దీంతో శాటిలైన్ తయారిలో బీజేపి క్రెడిడ్ ఏది లేదంటూ పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధి డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందిస్తూనే మరోవైపు మోడిని పై సెటైర్లు వేశారు..ఈ సంధర్భంలోనే మోడికి ప్రపంచ నాటక రంగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో పేర్కోన్నారు,ఈ నేఫథ్యంలోనే బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కూడ మిషన్ శక్తిపై మోడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ సీరియస్
మోడిని నాటకకర్తగా పేర్కోంటు చేసిన ట్వీట్ బిజేపి సీరియస్ గా తీసుకుంది,దీంతో ఆపార్టీ చీఫ్ అమిత్ షా రాహుల్ గాంధిపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధి అటు సైనికులను ,శాస్త్రవేత్తలను అవమానిస్తున్నడని అన్నారు. రాహుల్ గాంధి రాజరిక పోకడలకు పోతున్నారని అన్నారు,రాజరిక పోకడలతోనే దేశాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. దీంతోపాటు తమ జీవీతాలను ఫణంగా పెడుతున్న సైనికులను ,అదే విధంగా శాస్త్రవేత్తలను సైతం కూడ అవమానిస్తున్నారని అన్నారు.ఇక ఆర్ధిక మంత్రి ఆరుణ్ జైట్లి కూడ దీనిపై స్పందించారు, సైంటిస్టుల స్వంత శక్తిని శంకించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లడడం విడ్డురంగా ఉందని విమర్శించారు.2012 లో యాంటీ శాటిలైట్ తయారికి డీఆర్డీవో సిద్దంగా ఉన్నా, ప్రభుత్వం అనుమతించలేదని డీఆర్డీవో చీఫ్ వీకే సరస్వత్ చెప్పారని అన్నారు.
మొత్తం మీద రెండు పార్టీలు ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు పై సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు దీంతో రెండు పార్టీల్లో యుద్ద వాతవరణ నెలకోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications