lockdown: ముంబై తర్వాత ఢిల్లీ, ఇక్కడే ఉండండి, కూలీలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపు
లాక్డౌన్ పొడిగించడంతో మహారాష్ట్రలో వలసకూలీలు బాంద్రా రైల్వేస్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొనగా.. ఢిల్లీ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. దేశ రాజధానిలో ఉన్న కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అయితే ఇప్పటికే కొందరు కూలీలు గతనెలలో ఢిల్లీ నుంచి వెళ్లిపోవడంతో.. ఇప్పుడు కూడా వెళతారమోననే ఆందోళన నెలకొంది.
లాక్డౌన్ మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో వలసకూలీలు రాష్ట్రంలోనే ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అప్పటివరకు అందరూ క్రమశిక్షణతో ఉండాలని పేర్కొన్నారు. గత 21 రోజుల ఉన్న మాదిరిగానే.. మే 3 వరకు కూడా ఉండాలని తెలిపారు. ఈ మేరకు ట్వీట్టర్లో వీడియో రిలీజ్ చేశారు. అదే సమయంలో పుకార్లను ప్రజలు నమ్మొద్దని కోరారు. మరికొందరు బస్సులు ఉన్నాయని, ఇంటికి తీసుకెళతామని మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

లాక్డౌన్ మే 3వ తేదీ వరకు ప్రధాని మోడీ పొడిగించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే సామాజిక దూరం పాటించాలని కోరారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications