Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్ ఫలితాలపై ఉత్కంఠ, అటుఇటగా ఎగ్జిట్ పోల్స్

పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితిష్‌కుమార్, మహాకూటమి మధ్య పోరుగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(ఆదివారం) విడుదల కానున్నాయి. నువ్వా, నేనా అన్నట్టు సాగిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠకు రేపు తెరపడనుంది. అయితే ఇటు ఎన్డీఏ, అటు మహాకూటమి వేటికవే విజయంపై ధీమాగా ఉన్నాయి.

మొత్తం 243 సీట్లకు ఎన్నికలు జరగగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికల్లా విజయం ఎవరిదో దాదాపు తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలావరకు ఎన్డీయే.. మహాకూటమి మధ్య హోరాహోరీ నడుస్తుందని పేర్కొన్నాయి. స్వల్ప సీట్ల తేడాతో ఎన్డీయే కూటమి విజయం సాధించవచ్చని అంచనా వేశాయి.

Counting of votes on Sunday in high-stakes Bihar elections

టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీయేకు పూర్తి మెజారిటీ కట్టబెట్టాయి. ఐదు విడతలుగా జరిగిన బిహార్ ఎన్నికలు అక్టోబరు 12న ప్రారంభం కాగా, నవంబరు 5న ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆస్తకి నెలకొంది.

అన్ని పార్టీల హేమాహేమీలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎన్డీయే, మహాకూటమిలోని ముఖ్య నాయకులపై ఎన్నికల అధికారులు 12 కేసులు నమోదు చేశారు.

Counting of votes on Sunday in high-stakes Bihar elections

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన 30 ర్యాలీల్లో పాల్గొనగా, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 85 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాగా, ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మాత్రం అందరిలో ఉత్కంఠను మరింత రెట్టింపు చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+