దళిత బాలికపై రేప్, హత్య: లోనికి చొప్పించి, ఆపై హత్య
Recommended Video
చండీఘడ్: హర్యానా రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్భయలాంటి సంఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలిక శవం జింద్ జిల్లాలో ఈ నెల 12వ తేదీన కనిపించింది. బాలిక సామూహిక అత్యాచారానికి గురై ఉంటుందని, లోనికి ఓ వస్తువును చొప్పించడం వల్ల ఆమె కాలేయం ఛిద్రమైందని రోహతక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదివారంనాడు చెప్పింది.
బాలిక ఈ నెల 9వ తేదీన కురక్షేత్రలో తప్పిపోయింది. జనవరి 10వ తేదీన ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కురుక్షేత్ర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఛిద్రమైన స్థితిలో ఆమె శవం జింద్ జిల్లాలోని ఓ గ్రామంలో కనిపించింది.
ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఓ బాలుడి పాత్ర ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను కూడా ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఆమె శరీరంపై పలు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
అయితే, ఒక్కరు మాత్రమే ఆమెపై అత్యాచారం చేశారని చెప్పడానికి వీల్లేదని, ఇద్దరికన్నా ఎక్కువ మంది ఆమెపై లైంగిక దాడి జరిపి ఉంటారని, ఆమె యోనిలోకి ఓ వస్తువును కూడా చొప్పించడానికి ప్రయత్నించారని, ఆమె కాలేయం ఛిద్రమైందని అంటున్నారు.
ఆమె శరీరంపై చిరిగిన చొక్కా మాత్రమే ఉంది. ముఖం, మెడ, పెదవులపై గాయాలున్నాయని చెబుతున్నారు. లైంగిక దాడిని తీవ్రంగా ప్రతిఘటించినట్లు అర్థమవుతోంది. ఆమె శవం శుక్రవారంనాడు బుద్ధఖేరా గ్రామం సమీపంలోని కాలువ వద్ద కనిపించింది.
శవం కనిపించిన రోజుకు రెండు మూడు రోజుల ముందే ఆమెను చంపి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరిని కూడా అరెస్టు చేయలేదు. దాదాపు 250 మంది పోలీసులు ఆ పరిసరాల్లో గాలింపు చర్యలు జరిపారు. అయితే, ఏ విధమైన క్లూ దొరకలేదు.